మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎక్కువ సమయం సామాజిక సేవకు వినియోగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈఓ) సత్యనాదెళ్లతో పాటు కంపెనీలోని ఇతర సభ్యులకు సాంకేతిక సలహాదారుగా కొనసాగుతానని వెల్లడించారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రెండోస్థానంలో ఉన్న బిల్గేట్స్.. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా పలు దేశాల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, ఆర్థిక, ఉపాధి కల్పన రంగాల్లో ఈ ఫౌండేషన్ ఆర్థిక, సహాయ సహకారాలు అందిస్తోంది.