ETV Bharat / business

చివరి గంటలో రిలయన్స్ దూకుడు- సెన్సెక్స్ 458+

author img

By

Published : Jul 17, 2020, 3:47 PM IST

హెవీ వెయిట్ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 548 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 188 పాయింట్లు పుంజుకుంది.

today stock markets
నేటి స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 548 పాయింట్లు వృద్ధిచెంది 37,020 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 162 పాయింట్ల స్వల్ప లాభంతో 10,902 వద్ద స్థిరపడింది.

రిలయన్స్ సహా హెవీ వెయిట్ షేర్లలో చివరి గంటలో నమోదైన కొనుగోళ్లు లాభాలకు ప్రధాన కారణం. ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో జపాన్ సూచీ మినహా.. చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు లభాలతో ముగిశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 37,109 పాయింట్ల అత్యధిక స్థాయి, 36,513 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 10,930 పాయింట్ల గరిష్ఠ స్థాయి;10,750 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఓఎన్​జీసీ, రిలయన్స్, టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నెస్లే, టీసీఎస్, హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి శుక్రవారం 16 పైసలు పెరిగింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.75.02 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ కాలంలో 6.5 లక్షల ఉద్యోగాల కోత​!

స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 548 పాయింట్లు వృద్ధిచెంది 37,020 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 162 పాయింట్ల స్వల్ప లాభంతో 10,902 వద్ద స్థిరపడింది.

రిలయన్స్ సహా హెవీ వెయిట్ షేర్లలో చివరి గంటలో నమోదైన కొనుగోళ్లు లాభాలకు ప్రధాన కారణం. ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో జపాన్ సూచీ మినహా.. చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు లభాలతో ముగిశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 37,109 పాయింట్ల అత్యధిక స్థాయి, 36,513 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 10,930 పాయింట్ల గరిష్ఠ స్థాయి;10,750 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఓఎన్​జీసీ, రిలయన్స్, టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నెస్లే, టీసీఎస్, హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి శుక్రవారం 16 పైసలు పెరిగింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.75.02 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ కాలంలో 6.5 లక్షల ఉద్యోగాల కోత​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.