ETV Bharat / business

అయ్యో మార్క్​.. రాత్రికి రాత్రే రూ.52 వేల కోట్లు లాస్​!

ప్రపంచవ్యాప్తంగా సోమవారం ఫేస్​బుక్​​ సేవలు నిలిచిపోవడం వల్ల సంస్థ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్​ భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారు. అమెరికా ఎక్స్ఛేంజీలో ఫేస్​బుక్ షేర్లు దాదాపు 5 శాతం పతనమయ్యాయి. దీనితో ఆయన గంటల వ్యవధిలో రూ.52 వేల కోట్ల నష్టపోయినట్లు తెలిసింది.

author img

By

Published : Oct 5, 2021, 10:26 AM IST

Mark Zuckerberg
మార్క్ జుకర్​బర్గ్​

ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్ సేవలు సోమవారం చాలా సేపు నిలిచిపోవడం ఆ సంస్థకు భారీ నష్టాలను మిగిల్చింది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి గంటలకు నిలిచిపోయిన ఈ ప్లాట్​ఫామ్స్​ సేవలు.. దాదాపు 7 గంటల తర్వాత తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఫేస్​బుక్ చరిత్రలో ఇంత సేపు సేవలు నిలిచిపోవడం ఇదే తొలిసారి.

ఈ ప్రభావంతో అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (నాస్​డాక్​లో) ఫేస్​బుక్​ షేర్లు 4.9 శాతం పడిపోయాయి. దీనితో ఫేస్​బుక్​ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ సంపద 7 బిలియన్​ డాలర్లకుపైగా (రూ.52 వేల కోట్లు) తగ్గింది. ఫలితంగా ఆయన మొత్తం సంపద 121.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో మార్క్ జుకర్​బర్గ్​ 5వ స్థానానికి పడిపోయారు.

ఫేస్​బుక్​పై ట్విట్టర్​లో మీమ్స్​..

చాలా సేపు సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో.. ప్రత్యర్థి సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్​లో యూజర్లు.. ఫేస్​బుక్​, వాట్సాప్​, ఇన్​స్టాను ట్రోల్​ చేశారు. ట్విట్టర్​ కూడా దీనిపై తనదైన శైలిలో స్పందించింది.

అయితే వినియోగదారులకు ఏర్పడిన అసౌకర్యానికి ఫేస్​బుక్​ క్షమాపణలు చెప్పింది. సంస్థ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్​ కూడా యూజర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు.. సేవల పునరుద్ధరణ తర్వాత ఫేస్​బుక్​లో ఓ పోస్ట్ చేశారు.

Mark Zuckerberg
మార్క్ జుకర్​బర్గ్​ ఫేస్​బుక్​ పోస్ట్​

ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్ సేవలు సోమవారం చాలా సేపు నిలిచిపోవడం ఆ సంస్థకు భారీ నష్టాలను మిగిల్చింది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి గంటలకు నిలిచిపోయిన ఈ ప్లాట్​ఫామ్స్​ సేవలు.. దాదాపు 7 గంటల తర్వాత తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఫేస్​బుక్ చరిత్రలో ఇంత సేపు సేవలు నిలిచిపోవడం ఇదే తొలిసారి.

ఈ ప్రభావంతో అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (నాస్​డాక్​లో) ఫేస్​బుక్​ షేర్లు 4.9 శాతం పడిపోయాయి. దీనితో ఫేస్​బుక్​ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ సంపద 7 బిలియన్​ డాలర్లకుపైగా (రూ.52 వేల కోట్లు) తగ్గింది. ఫలితంగా ఆయన మొత్తం సంపద 121.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో మార్క్ జుకర్​బర్గ్​ 5వ స్థానానికి పడిపోయారు.

ఫేస్​బుక్​పై ట్విట్టర్​లో మీమ్స్​..

చాలా సేపు సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో.. ప్రత్యర్థి సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్​లో యూజర్లు.. ఫేస్​బుక్​, వాట్సాప్​, ఇన్​స్టాను ట్రోల్​ చేశారు. ట్విట్టర్​ కూడా దీనిపై తనదైన శైలిలో స్పందించింది.

అయితే వినియోగదారులకు ఏర్పడిన అసౌకర్యానికి ఫేస్​బుక్​ క్షమాపణలు చెప్పింది. సంస్థ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్​ కూడా యూజర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు.. సేవల పునరుద్ధరణ తర్వాత ఫేస్​బుక్​లో ఓ పోస్ట్ చేశారు.

Mark Zuckerberg
మార్క్ జుకర్​బర్గ్​ ఫేస్​బుక్​ పోస్ట్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.