ETV Bharat / business

పెరిగిన విమాన ప్రయాణాలు- కరోనా నుంచి కోలుకున్నట్లేనా?

author img

By

Published : Oct 6, 2021, 5:33 PM IST

విమాన ప్రయాణాలు దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నట్లు రేటింగ్​ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్​లో దాదాపు 69 లక్షల మంది విమాన ప్రయాణాలు చేసినట్లు తెలిపింది. కరోనా కేసుల్లో తగ్గుదల, ఆంక్షల సడలింపుల వంటివి ఇందుకు కారణంగా పేర్కొంది.

Domestic air passenger grow
పెరిగిన విమాన ప్రయాణాలు

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, దాదాపు అన్ని రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో దేశీయంగా విమాన ప్రయాణాలు ఊపందుకుంటున్నాయి. సెప్టెంబర్​లో దాదాపు 69 లక్షల మంది దేశీయంగా విమాన ప్రయాణాలు చేసినట్లు క్రెడిట్​ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఆగస్టు (67 లక్షలు)తో పోలిస్తే ఈ మొత్తం 2-3 శాతం ఎక్కువని తెలిపింది. పండుగల సీజన్​ కూడా ఇందుకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది.

'2020 సెప్టెంబర్​తో పోలిస్తే.. గత నెలలో దేశీయ విమాన సంస్థలు 54 శాతం అధిక సామర్థ్యంతో పని చేశాయి. ఇదే సమయంలో ప్యాసింజర్​ ట్రాఫిక్​ 74 శాతం పెరిగింద'ని ఇక్రా నివేదిక పేర్కొంది.

ఇక్రా నివేదికలోని ముఖ్యాంశాలు..

  • గత నెలలో దేశీయంగా విమానాలు 61,100 రాకపోకలు సాగించాయి. 2020 సెప్టెంబర్​లో ఈ సంఖ్య 39,628గా ఉంది.
  • 2021 సెప్టెంబర్​లో రోజూవారీగా విమానాలు సగటున 2,100 సార్లు రాకపోకలు సాగించాయి. గత ఏడాది సెప్టెంబర్​లో రోజువారీ సగటు రాకపోకల సంఖ్య 1,321గా ఉంది. 2021 జనవరిలో అత్యధికంగా ఈ సంఖ్య 2,200గా నమోదైంది.
  • సెప్టెంబర్​లో సగటున ఒక విమానంలో ప్రయాణికుల సంఖ్య 113కి తగ్గింది. ఆగస్టులో ఇది 117గా ఉంది.
  • 2021 ఆగస్టు 12 నుంచి విమానాల్లో ప్రయాణికుల సామర్థ్యం 72.5 శాతంగా ఉండగా.. సెప్టెంబర్​ 18 నుంచి 85 శాతానికి పెరిగింది.
  • గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్​ (ఏటీఎఫ్​) ధరలు 78.6 శాతం పెరిగాయి.
  • దేశీయ విమానయాన సంస్థలు చాలా వరకు ఇంకా లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి.

ఇదీ చదవండి: 'కరోనాతో విమాన రంగం కుదేలు.. అయినా రికవరీకి ఛాన్స్'

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, దాదాపు అన్ని రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో దేశీయంగా విమాన ప్రయాణాలు ఊపందుకుంటున్నాయి. సెప్టెంబర్​లో దాదాపు 69 లక్షల మంది దేశీయంగా విమాన ప్రయాణాలు చేసినట్లు క్రెడిట్​ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఆగస్టు (67 లక్షలు)తో పోలిస్తే ఈ మొత్తం 2-3 శాతం ఎక్కువని తెలిపింది. పండుగల సీజన్​ కూడా ఇందుకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది.

'2020 సెప్టెంబర్​తో పోలిస్తే.. గత నెలలో దేశీయ విమాన సంస్థలు 54 శాతం అధిక సామర్థ్యంతో పని చేశాయి. ఇదే సమయంలో ప్యాసింజర్​ ట్రాఫిక్​ 74 శాతం పెరిగింద'ని ఇక్రా నివేదిక పేర్కొంది.

ఇక్రా నివేదికలోని ముఖ్యాంశాలు..

  • గత నెలలో దేశీయంగా విమానాలు 61,100 రాకపోకలు సాగించాయి. 2020 సెప్టెంబర్​లో ఈ సంఖ్య 39,628గా ఉంది.
  • 2021 సెప్టెంబర్​లో రోజూవారీగా విమానాలు సగటున 2,100 సార్లు రాకపోకలు సాగించాయి. గత ఏడాది సెప్టెంబర్​లో రోజువారీ సగటు రాకపోకల సంఖ్య 1,321గా ఉంది. 2021 జనవరిలో అత్యధికంగా ఈ సంఖ్య 2,200గా నమోదైంది.
  • సెప్టెంబర్​లో సగటున ఒక విమానంలో ప్రయాణికుల సంఖ్య 113కి తగ్గింది. ఆగస్టులో ఇది 117గా ఉంది.
  • 2021 ఆగస్టు 12 నుంచి విమానాల్లో ప్రయాణికుల సామర్థ్యం 72.5 శాతంగా ఉండగా.. సెప్టెంబర్​ 18 నుంచి 85 శాతానికి పెరిగింది.
  • గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్​ (ఏటీఎఫ్​) ధరలు 78.6 శాతం పెరిగాయి.
  • దేశీయ విమానయాన సంస్థలు చాలా వరకు ఇంకా లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి.

ఇదీ చదవండి: 'కరోనాతో విమాన రంగం కుదేలు.. అయినా రికవరీకి ఛాన్స్'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.