మాపై అక్రమ కేసులు ఎత్తివేయండి : వైకాపా గుంటూరు జిల్లా పల్నాడులో వైకాపా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని... ఆ పార్టీ సీనియర్ నేతలు ఎస్పీ రాజశేఖర్ బాబును కోరారు. ఇనిమెట్లలో సభాపతి పోలింగ్ బూత్ ఆక్రమించేందుకు ప్రయత్నించారని వారు ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి, అంబటి, కాసు మహేశ్ రెడ్డి..గుంటూరు గ్రామీణ ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బొత్స డిమాండ్ చేశారు.కోడెల శివప్రసాదరావుపై దాడి..అసలేం జరిగింది..! ఇక్కడ క్లిక్ చేయండి