ETV Bharat / briefs

రేపు ఒంటిమిట్ట రామయ్య కల్యాణం.. ట్రాఫిక్ ఆంక్షలు

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణ మహోత్సవం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం నుంచి రాత్రి స్వామివారి కల్యాణం ముగిసే వరకు ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో ఈ ఆంక్షలు ఉంటాయని కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు.

author img

By

Published : Apr 17, 2019, 10:07 PM IST

కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి
కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణ మహోత్సవం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం నుంచి రాత్రి స్వామివారి కల్యాణం ముగిసే వరకు ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో ఈ ఆంక్షలు ఉంటాయని కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు.

కడప శివారులోని డీటీసీ వద్దనున్న రిమ్స్ బైపాస్ మీదుగా భారీ వాహనాలు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి కడపకు వచ్చే వాహనాలను సాలాబాద్ క్రాస్ నుంచి మలకాటిపల్లి, రాచపల్లి, సీతానగరం, రాచగుడిపల్లి, ఇబ్రహీంపేట, గంగపేరూరు, బ్రాహ్మణపల్లి, మొహిద్దీన్ సాబ్ పల్లి, ముమ్ముడిగుండుపల్లి, మాధవరం ఉప్పరపల్లి వద్ద హైవేలో చేరుకోవాలని ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు. కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు మాధవరం, ఉప్పరపల్లి, సాయిబాబా గుడి వైపు నుంచి ముమ్మడిగుండుపల్లి, బ్రాహ్మణపల్లి, పేరూరుగంగ, మలకాటిపల్లి మీదుగా సాలాబాద్ క్రాస్ నుంచి వాహనాలు వెళ్లాలని ఎస్పీ సూచించారు.

కడప నుంచి ఒంటిమిట్టకు వెళ్లే భక్తుల వాహనాలు...కల్యాణ వేదిక పడమర వైపున ఓబుల్ రెడ్డి వాటర్ ప్లాంట్, సాయి కాళేశ్వర్ డిగ్రీ కళాశాల, ఉప్పరపల్లి వద్దనున్న సాయిబాబా గుడి వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజంపేట వైపు నుంచి ఒంటిమిట్టకు వచ్చే వాహనాలను ఆలయం ఎదురుగా ఉన్న దుర్గమ్మగుడి వద్ద, సాలాబాద్ క్రాస్ వద్ద, మలకాటిపల్లెలో పార్కింగ్ స్థలాలు కేటాయించామన్నారు. కల్యాణం సందర్భంగా భక్తులంతా ట్రాఫిక్ ఆంక్షలు పాటించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని అభిషేక్ మహంతి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : బైక్ నుంచి 3 లక్షలు చోరీ... సీసీ కెమెరాలో దృశ్యాలు

కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణ మహోత్సవం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం నుంచి రాత్రి స్వామివారి కల్యాణం ముగిసే వరకు ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో ఈ ఆంక్షలు ఉంటాయని కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు.

కడప శివారులోని డీటీసీ వద్దనున్న రిమ్స్ బైపాస్ మీదుగా భారీ వాహనాలు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి కడపకు వచ్చే వాహనాలను సాలాబాద్ క్రాస్ నుంచి మలకాటిపల్లి, రాచపల్లి, సీతానగరం, రాచగుడిపల్లి, ఇబ్రహీంపేట, గంగపేరూరు, బ్రాహ్మణపల్లి, మొహిద్దీన్ సాబ్ పల్లి, ముమ్ముడిగుండుపల్లి, మాధవరం ఉప్పరపల్లి వద్ద హైవేలో చేరుకోవాలని ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు. కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు మాధవరం, ఉప్పరపల్లి, సాయిబాబా గుడి వైపు నుంచి ముమ్మడిగుండుపల్లి, బ్రాహ్మణపల్లి, పేరూరుగంగ, మలకాటిపల్లి మీదుగా సాలాబాద్ క్రాస్ నుంచి వాహనాలు వెళ్లాలని ఎస్పీ సూచించారు.

కడప నుంచి ఒంటిమిట్టకు వెళ్లే భక్తుల వాహనాలు...కల్యాణ వేదిక పడమర వైపున ఓబుల్ రెడ్డి వాటర్ ప్లాంట్, సాయి కాళేశ్వర్ డిగ్రీ కళాశాల, ఉప్పరపల్లి వద్దనున్న సాయిబాబా గుడి వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజంపేట వైపు నుంచి ఒంటిమిట్టకు వచ్చే వాహనాలను ఆలయం ఎదురుగా ఉన్న దుర్గమ్మగుడి వద్ద, సాలాబాద్ క్రాస్ వద్ద, మలకాటిపల్లెలో పార్కింగ్ స్థలాలు కేటాయించామన్నారు. కల్యాణం సందర్భంగా భక్తులంతా ట్రాఫిక్ ఆంక్షలు పాటించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని అభిషేక్ మహంతి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : బైక్ నుంచి 3 లక్షలు చోరీ... సీసీ కెమెరాలో దృశ్యాలు

Intro:తిరుమల శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల్లో భాగంగా మొదటి రోజున శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వసంత మండపం చేరుకున్నారు. అక్కడ వసంతోత్సవ ఆస్థానాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య విశేష సమర్పణ వంటి వైదిక కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. వసంతమండపాన్ని ప్రకృతి సోయగాలు ఉట్టిపడేవిధంగా తీర్చిదిద్దారు.


NOTE : FTP లో పంపిన విజువల్స్ ని వాడుకోగలరు.


Body:.


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.