రేణిగుంట విమానాశ్రయంలో సూట్కేసు కలకలం! చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ సూట్ కేసు కలకలం రేపింది. విమానాశ్రయం కారు పార్కింగ్ వద్ద ఓ ప్రయాణికుడు సూట్ కేసు వదిలివెళ్లాడు. సుట్కేసును గుర్తించిన సీఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు డాగ్ స్క్వాడ్కు సమాచారం అందించారు. అప్రమత్తమైన డాగ్ స్క్వాడ్ సిబ్బంది సూట్కేసును తనిఖీ చేసి ఏమిలేదని నిర్థారించింది. ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన కల్యాణ్ అనే ప్రయాణికుడు సూటుకేసును మరిచిపోయినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. సూటుకేసును విమానాశ్రయ అధికారులు ఏర్పేడు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి : తితిదే బోర్డు ఛైర్మన్ నియామక ఉత్తర్వులు జారీ