ETV Bharat / briefs

'సుప్రీం తీర్పుతో.. ఆదివాసీలు రోడ్డున పడతారు'

అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసీలను ఖాళీ చేయమనడం భావ్యం కాదని ఏపీ రైతు కూలీ సంఘం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 11 లక్షల ఆదివాసీల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై స్పందించి సుప్రీం తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కోరింది.

author img

By

Published : Jun 2, 2019, 1:51 PM IST

రైతు కూలీ సంఘం
రైతు కూలీ సంఘం
2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ ప్రాంతాల్లో పట్టాలు లేకుండా నివసిస్తున్న ఆదివాసీలు ఆ ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును సవరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం కోరుతోంది. ఇవాళ విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు కూలీ సంఘం సహాయ కార్యదర్శి డి.వర్మ మాట్లాడుతూ...ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండా ఆదివాసీలను గిరిజన ప్రాంతాల నుంచి ఖాళీ చేయమనడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుపై కొత్త ప్రభుత్వాలు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. లేకపోతే దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 11 లక్షల మంది గిరిజనుల జీవితాలు అగమ్యగోచరం అవుతాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో జీవనానికి అలవాటుపడిన ఆదివాసీలు మైదాన ప్రాంతాల్లో బతకలేరన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కోరారు.

ఇవీ చూడండి : తుపాకి తిరగేసి వైద్యునిపై దుండగుల దాడి

రైతు కూలీ సంఘం
2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ ప్రాంతాల్లో పట్టాలు లేకుండా నివసిస్తున్న ఆదివాసీలు ఆ ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును సవరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం కోరుతోంది. ఇవాళ విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు కూలీ సంఘం సహాయ కార్యదర్శి డి.వర్మ మాట్లాడుతూ...ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండా ఆదివాసీలను గిరిజన ప్రాంతాల నుంచి ఖాళీ చేయమనడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుపై కొత్త ప్రభుత్వాలు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. లేకపోతే దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 11 లక్షల మంది గిరిజనుల జీవితాలు అగమ్యగోచరం అవుతాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో జీవనానికి అలవాటుపడిన ఆదివాసీలు మైదాన ప్రాంతాల్లో బతకలేరన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కోరారు.

ఇవీ చూడండి : తుపాకి తిరగేసి వైద్యునిపై దుండగుల దాడి

Govind Ghat (Uttarakhand), Jun 01 (ANI): One of the most revered Sikh pilgrimage sites, Hemkund Sahib Gurdwara is set to open its portal for devotees on Saturday, after a six-month long winter break. The first batch of pilgrims to Hemkund left from Govind Ghat Gurudwara on Friday after the pilgrimage was formally flagged off by the Garhwal Commissioner BVRC Purushottam. As many as eight thousand Sikh devotes are part of the first batch of pilgrims which will be trekking for 18 kilometres from Pulna to reach the Gurudwara which is situated at an height of over 15,000 feet from the sea level. The Gurudwara is situated beside a lake and it is believed that the 10th Sikh Guru, Gobind Singh had meditated at the site. Thousands of pilgrims take the trek every year to reach the holy site.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.