ETV Bharat / briefs

కోనసీమ తిరుపతికి పోటెత్తిన భక్తులు

author img

By

Published : Jun 29, 2019, 1:47 PM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచింది తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం. ఇక్కడున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఏడు శనివారాలు నోము నోచుకునే భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి.

కోనసీమ తిరుపతిలో నోము నోచేందుకు పోటెత్తిన భక్తుల
కోనసీమ తిరుపతిలో నోము నోచేందుకు పోటెత్తిన భక్తుల

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి నోము నోచుకునేందుకు వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏడు వారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే... తాము కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామిని దర్శించుకునేందుకు సుమారు మూడు గంటల సమయం పడుతోంది. వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులందరికీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కోనసీమ తిరుపతిలో నోము నోచేందుకు పోటెత్తిన భక్తుల

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి నోము నోచుకునేందుకు వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏడు వారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే... తాము కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామిని దర్శించుకునేందుకు సుమారు మూడు గంటల సమయం పడుతోంది. వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులందరికీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదీ చదవండీ :

వైరల్​: విమానాన్ని ఢీకొట్టిన 'పక్షిరాజు'

Intro:గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానాన్ మాల్యా అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గుంటూరు వచ్చిన ఆయన ఇక్కడి రైల్వే స్టేషన్లో సౌకర్యాలు, జరుగుతున్న పనులను పరిశీలించారు. కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్న విషయాన్ని గుర్తించారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ప్రయాణీకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రైల్వే గార్డులకు ప్రత్యేకంగా రూపొందించిన కిట్లు అందజేశారు. అలాగే మరమ్మతులు నిర్వహించే సిబ్బందికి అధునాతన పనిముట్లు, రక్షణ ఉపకరణాలు పంపిణీ చేశారు. అనంతరం రైల్వే ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న చికిత్స అడిగి తెలుసుకున్నారు. కొత్త భవనాల పనులు పరిశీలించారు. అనంతరం ఆయన నంద్యాల బయలుదేరి వెళ్లారు. మాల్యా వెంట గుంటూరు రైల్వే డీఆర్ఎం భూమా ఉన్నారు.

విజివల్స్...Body:Reporter          : S.P.Chandra Sekhar
Date         : 29-06-2019
Centre         : Guntur
File         : Ap_Gnt_01_29_Railway_GM_Visit_AV_3053245Conclusion:8008020895
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.