ETV Bharat / briefs

'108 అత్యవసర సేవలపై అలసత్వం వద్దు'

108 అత్యవసర సేవల్లో ఎటువంటి అలసత్వం కూడదని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్. జవహర్ రెడ్డి తెలిపారు. 108 సేవలను నిర్వహిస్తోన్న మంగళగిరిలోని బీవీజీ ఇండియా సంస్థ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కంట్రోల్ రూంను ఆయన పరిశీలించారు.  అంబులెన్స్ సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

author img

By

Published : Jun 18, 2019, 10:13 PM IST

108 అత్యవసర సేవలపై అలసత్వం వద్దు : వైద్య, ఆరోగ్య కార్యదర్శి
108 అత్యవసర సేవలపై అలసత్వం వద్దు : వైద్య, ఆరోగ్య కార్యదర్శి
రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవల్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని..నిర్ణీత సమయంలోగా వాహనాలు గమ్యానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో ఉన్న బీవీజీ ఇండియా సంస్థ నిర్వహిస్తోన్న 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ కంట్రోల్ రూంను జవహర్ రెడ్డి పరిశీలించారు. బీవీజీ సంస్థ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. బీవీజీ ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో 108 సేవలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలబెట్టే 108 వాహనాల్లో ఆక్సిజన్, వైద్య పరికరాలు, మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 108 అత్యవసర సేవల విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దన్నారు. ఏమైనా సమస్యలుంటే సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిధుల విడుదల విషయంలో జాప్యాన్ని నివారిస్తామని, నిధులకు సంబంధించి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు.

108 వాహనాల నిర్వహణలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జిల్లా స్థాయిలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వాహనాల రిపేర్​కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలోనే విడిభాగాలు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాఖాపరమైన నిర్వహణకు నిధులు విడుదలకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కనీసం మూడు నెలలకు సరిపడా నిధుల్ని ముందే అందుబాటులో ఉంచుకుని అత్యవసర సర్వీసులకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండి : బెట్టింగ్ వ్యవహారం...ఆసుపత్రిపై అగంతకులు దాడి

108 అత్యవసర సేవలపై అలసత్వం వద్దు : వైద్య, ఆరోగ్య కార్యదర్శి
రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవల్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని..నిర్ణీత సమయంలోగా వాహనాలు గమ్యానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో ఉన్న బీవీజీ ఇండియా సంస్థ నిర్వహిస్తోన్న 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ కంట్రోల్ రూంను జవహర్ రెడ్డి పరిశీలించారు. బీవీజీ సంస్థ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. బీవీజీ ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో 108 సేవలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలబెట్టే 108 వాహనాల్లో ఆక్సిజన్, వైద్య పరికరాలు, మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 108 అత్యవసర సేవల విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దన్నారు. ఏమైనా సమస్యలుంటే సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిధుల విడుదల విషయంలో జాప్యాన్ని నివారిస్తామని, నిధులకు సంబంధించి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు.

108 వాహనాల నిర్వహణలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జిల్లా స్థాయిలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వాహనాల రిపేర్​కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలోనే విడిభాగాలు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాఖాపరమైన నిర్వహణకు నిధులు విడుదలకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కనీసం మూడు నెలలకు సరిపడా నిధుల్ని ముందే అందుబాటులో ఉంచుకుని అత్యవసర సర్వీసులకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండి : బెట్టింగ్ వ్యవహారం...ఆసుపత్రిపై అగంతకులు దాడి

Intro:Ap_Vsp_62_18_Workshop_On_Devadasi_System_Ab_C8


Body:దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో దేవదాసి వ్యవస్థ నడుస్తుండటం శోచనీయమని ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ ఎం.వి.ఆర్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు దేవదాసీ వ్యవస్థను ఎలా పని చేస్తాయి వాటివల్ల యువతులకు జరిగే అన్యాయం వాటిని ఎలా అరికట్టాలి అనే అంశాలపై ఇవాల్టి నుంచి రెండు రోజుల పాటు ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించనున్నట్లు రాజు తెలిపారు దళిత వర్గాలకు చెందిన యువతులను దేవదాసీలుగా ముద్రించి వారిని అగ్రవర్ణాల వారు శారీరకంగా అనుభవించే ఈ దేవదాసి వ్యవస్థ ను సమూలంగా నాశనం చేయాలని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమాజంలో కూడా ఇంకా ఇలాంటి దేవదాసి వ్యవస్థ లు 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో అమలు కావడం విచారకరమని వాపోయారు ఈ దేవదాసి వ్యవస్థ పై రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం నిర్వహించి వాటిని నిర్మూలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు రాజు వెల్లడించారు
----------
బైట్ ఎంవిఆర్ రాజు ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగ అధిపతి
---------- ( ఓవర్).


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.