ETV Bharat / briefs

నేడు కృష్టా ట్రిబ్యునల్ ముందు ఇరు రాష్ట్రాలు వాదనలు

author img

By

Published : Jul 1, 2019, 9:08 AM IST

కృష్ణా నదీ జలాల వివాదంపై ఇరు రాష్ట్రాలు.. ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించనున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు వాదనలు జరగనున్నాయి. నదీ జలాల పంపిణీ, మిగులు జలాలను ఇరు రాష్ట్రాల సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోన్న తరుణంలో ఈ వాదనలు కీలకం కానున్నాయి.

నేడు కృష్టా ట్రిబ్యునల్ ముందు ఇరు రాష్ట్రాలు వాదనలు

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వివాదాలపై వాదనలు వినిపించనున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా ట్రిబ్యునల్ ముందు నదీ జలాల కేటాయింపుపై తమ వాదనలు వినిపించనున్నాయి. ఇటీవలే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నదీ జలాల సద్వినియోగం, నీటి కేటాయింపులు, వరద నీరు సద్వినియోగం వంటి అంశాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాలు జలబంధంతో సాగాలనే భావంతో పనిచేస్తున్నట్లు ఇద్దరు సీఎంలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. తాజా వాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ట్రైబ్యునల్స్

కృష్ణా జలాల పంపిణీకి మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మధ్య తలెత్తిన వివాదాలు పరిష్కరించే నిమిత్తం.. కేంద్ర ప్రభుత్వం 1969లో ఆర్‌.ఎస్‌.బచావత్‌ ఛైర్మన్‌గా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 1976లో నివేదిక సమర్పించింది. ఆ ప్రకారం 75 శాతం లభ్యత ఆధారంగా మొత్తం 2,060 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయని నిర్థారించింది. వీటిలో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించారు.

ట్రిబ్యునల్‌ తీర్పునకు సమీక్షగా ఏప్రిల్‌ 2004లో బ్రజేష్‌ మిశ్రా ఛైర్మన్‌గా 'కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-2'ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ డిసెంబరులో 2010లో నివేదికను సమర్పించింది. అదనంగా 65 శాతం నీటి లభ్యత ఆధారంగా లభించే 163 టీఎమ్‌సీలను, మిగులు జలాలుగా గుర్తించిన 285 టీఎమ్‌సీలను మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని తీర్పు వెలువరించింది. ఈ ప్రకారం మొత్తం నదిలో నీటి లభ్యత 2,578 టీఎమ్‌సీలు. అందులో మహారాష్ట్రకు 666, కర్ణాటకకు 911, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,001 టీఎంసీలు కేటాయించింది.

రాష్ట్ర విభజన జరిగాక.. రెండు రాష్ట్రాల మధ్య అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం ప్రకారం, ట్రిబ్యునల్‌ తీర్పుల ప్రకారం కృష్ణా నదీ జలాల పంపిణీ అమలు, కొత్త ప్రాజెక్టుల అనుమతి సంబంధిత వివాదాల పరిష్కారానికి 'కృష్ణా నది యాజమాన్య బోర్డు'ను ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారమే రెండు రాష్ట్రాల మధ్య కేటాయింపులు చేస్తుంది. 2015లో ఉభయ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ కేటాయించిన 811 టీఎంసీల నీటిని 63.13, 36.87 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ 512.04, తెలంగాణ 298.96 టీఎంసీలు పంచుకోవాలి. తాజాగా.. ఇరు రాష్ట్రాల అవసరాల నేపథ్యంలో.. ట్రిబ్యునల్ ముందు ఎలాంటి వాదనలు వినిపిస్తారన్నది ఆసక్తిగా మారింది.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వివాదాలపై వాదనలు వినిపించనున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా ట్రిబ్యునల్ ముందు నదీ జలాల కేటాయింపుపై తమ వాదనలు వినిపించనున్నాయి. ఇటీవలే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నదీ జలాల సద్వినియోగం, నీటి కేటాయింపులు, వరద నీరు సద్వినియోగం వంటి అంశాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాలు జలబంధంతో సాగాలనే భావంతో పనిచేస్తున్నట్లు ఇద్దరు సీఎంలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. తాజా వాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ట్రైబ్యునల్స్

కృష్ణా జలాల పంపిణీకి మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మధ్య తలెత్తిన వివాదాలు పరిష్కరించే నిమిత్తం.. కేంద్ర ప్రభుత్వం 1969లో ఆర్‌.ఎస్‌.బచావత్‌ ఛైర్మన్‌గా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 1976లో నివేదిక సమర్పించింది. ఆ ప్రకారం 75 శాతం లభ్యత ఆధారంగా మొత్తం 2,060 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయని నిర్థారించింది. వీటిలో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించారు.

ట్రిబ్యునల్‌ తీర్పునకు సమీక్షగా ఏప్రిల్‌ 2004లో బ్రజేష్‌ మిశ్రా ఛైర్మన్‌గా 'కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-2'ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ డిసెంబరులో 2010లో నివేదికను సమర్పించింది. అదనంగా 65 శాతం నీటి లభ్యత ఆధారంగా లభించే 163 టీఎమ్‌సీలను, మిగులు జలాలుగా గుర్తించిన 285 టీఎమ్‌సీలను మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని తీర్పు వెలువరించింది. ఈ ప్రకారం మొత్తం నదిలో నీటి లభ్యత 2,578 టీఎమ్‌సీలు. అందులో మహారాష్ట్రకు 666, కర్ణాటకకు 911, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,001 టీఎంసీలు కేటాయించింది.

రాష్ట్ర విభజన జరిగాక.. రెండు రాష్ట్రాల మధ్య అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం ప్రకారం, ట్రిబ్యునల్‌ తీర్పుల ప్రకారం కృష్ణా నదీ జలాల పంపిణీ అమలు, కొత్త ప్రాజెక్టుల అనుమతి సంబంధిత వివాదాల పరిష్కారానికి 'కృష్ణా నది యాజమాన్య బోర్డు'ను ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారమే రెండు రాష్ట్రాల మధ్య కేటాయింపులు చేస్తుంది. 2015లో ఉభయ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ కేటాయించిన 811 టీఎంసీల నీటిని 63.13, 36.87 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ 512.04, తెలంగాణ 298.96 టీఎంసీలు పంచుకోవాలి. తాజాగా.. ఇరు రాష్ట్రాల అవసరాల నేపథ్యంలో.. ట్రిబ్యునల్ ముందు ఎలాంటి వాదనలు వినిపిస్తారన్నది ఆసక్తిగా మారింది.

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్....గుంటూరు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.తిరుపతి నుండి దైవ దర్శనం చేసుకొని పాలకొల్లు వెళ్తున్న 11 మంది భక్తులతో కూడిన ఫార్చ్యూన్ వాహనం ఆగి ఉన్న లారీని శరవేగంతో ఢీకొనడంతో వాహనంలో ఉన్న ఐదుగురు, ఇద్దరు పిల్లలు ముగ్గురు పెద్ద వాళ్లతో మొత్తం ఐదుగురు సంఘటనా స్థలంలో మరణించారు.మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి ఆరుగుర్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. వాహనంలో డ్రైవరు ఇరుక్కుపోవడంతో జెసిబి సాయంతో బయటకు తీసి రక్షించారు. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బువారి పాలెం గ్రామానికి చెందిన ఇరు కుటుంబాల వారు తిరుపతి దైవ దర్శనం నిమిత్తం వెళ్లి వస్తుండగా ఈ ఘోర సంఘటన జరిగింది.

చనిపోయిన వారు సూర్య భవాని 22 సంవత్సరాలు, వెంగుంటూరు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది

తిరుపతి నుండి దైవ దర్శనం చేసుకొని పాలకొల్లు వెళ్తున్న 11 మంది భక్తులతో కూడిన ఫార్చ్యూన్ వాహనం ఆగి ఉన్న లారీని శరవేగంతో ఢీకొనడంతో వాహనంలో ఉన్న ఐదుగురు, ఇద్దరు పిల్లలు ముగ్గురు పెద్ద వాళ్లతో మొత్తం ఐదుగురు సంఘటనా స్థలంలో మరణించారు.

మరి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి ఆరుగుర్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు

వాహనంలో డ్రైవరు ఇరుక్కుపోవడంతో జెసిబి సాయంతో బయటకు తీసి రక్షించారు

వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బువారి పాలెం గ్రామానికి చెందిన ఇరు కుటుంబాల వారు తిరుపతి దైవ దర్శనం నిమిత్తం వెళ్లి వస్తుండగా ఈ ఘోర సంఘటన జరిగింది. చనిపోయిన వారు సూర్య భవాని 22 సంవత్సరాలు, వెంకట్ 30 సంవత్సరాలు, గీతేశ్వరి బాబు 4 సంవత్సరాలు, సోనాక్షి 5 సంవత్సరాలు, మనోజ్ 22 సంవత్సరాలు.కట్ 30 సంవత్సరాలు, గీతేశ్వరి బాబు 4 సంవత్సరాలు, సోనాక్షి 5 సంవత్సరాలు, మనోజ్ 22 సంవత్సరాలు.Body:విజివల్స్Conclusion:విజివల్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.