ETV Bharat / briefs

ఎస్​పీ సభ్యుల నిరసనలతో రాజ్యసభ వాయిదా

సమాజ్​వాదీ పార్టీ నిరసనల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.

author img

By

Published : Feb 12, 2019, 2:05 PM IST

రాజ్యసభ వాయిదా

రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. ఎస్​పీ సభ్యుల నిరసనలతో ఎగువ సభ హోరేత్తింది. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్​ యాదవ్​ను లఖ్​నవూ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా రాజ్యసభలో గందరగోళం సృష్టించారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని ప్రమాణస్వీకార మహోత్సవానికి వెళ్తుండగా విమానాశ్రయంలో పోలీసులు అఖిలేష్​ను అడ్డుకున్నారు.​

ఈ అంశంపై నోటీసులు ఇవ్వనందున చర్చకు అనుమతించలేనని ఛైర్మన్​ వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. ఛైర్మన్​ అనుమతిలేనిదే ఎటువంటి సమస్యను చర్చించకూడదని వెంకయ్య సభ్యులకు చెప్పారు. అయినా సభ్యులు ఆందోళనలు తగ్గకపోవడంతో వెంకయ్య సభను వాయిదా వేశారు.

రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. ఎస్​పీ సభ్యుల నిరసనలతో ఎగువ సభ హోరేత్తింది. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్​ యాదవ్​ను లఖ్​నవూ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా రాజ్యసభలో గందరగోళం సృష్టించారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని ప్రమాణస్వీకార మహోత్సవానికి వెళ్తుండగా విమానాశ్రయంలో పోలీసులు అఖిలేష్​ను అడ్డుకున్నారు.​

ఈ అంశంపై నోటీసులు ఇవ్వనందున చర్చకు అనుమతించలేనని ఛైర్మన్​ వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. ఛైర్మన్​ అనుమతిలేనిదే ఎటువంటి సమస్యను చర్చించకూడదని వెంకయ్య సభ్యులకు చెప్పారు. అయినా సభ్యులు ఆందోళనలు తగ్గకపోవడంతో వెంకయ్య సభను వాయిదా వేశారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.