ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలరోజులపైనే సమయం ఉందని... వాటి కోసం ఎదురు చూస్తూ... సమయాన్ని వృథా చేయదలుచుకోలేదని సీఎం స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు-రాష్ట్రాభివృద్ధి తనకు ముఖ్యమని అన్నారు. రోజూ 15 వేల ట్రిప్పులు చొప్పున 3వేల 494 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేయాలని...తాగునీటి సరఫరాలో ప్రజా సంతృప్తి స్థాయి నూరుశాతం కనిపించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పూర్తైన ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా వివిధ జిల్లాలకు తాగునీటి సరఫరా జరగాలని సూచించారు.
'ఫలితాల కోసం ఎదురుచూడొద్దు - ప్రజల అవసరాలు తీర్చండి'
రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. 3,494 నివాస ప్రాంతాలకు తాగునీటిని ట్రాన్స్పోర్టేషన్ విధానంలో సరఫరా చేస్తున్నామని సీఎంకి అధికారులు వివరించారు.
ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలరోజులపైనే సమయం ఉందని... వాటి కోసం ఎదురు చూస్తూ... సమయాన్ని వృథా చేయదలుచుకోలేదని సీఎం స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు-రాష్ట్రాభివృద్ధి తనకు ముఖ్యమని అన్నారు. రోజూ 15 వేల ట్రిప్పులు చొప్పున 3వేల 494 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేయాలని...తాగునీటి సరఫరాలో ప్రజా సంతృప్తి స్థాయి నూరుశాతం కనిపించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పూర్తైన ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా వివిధ జిల్లాలకు తాగునీటి సరఫరా జరగాలని సూచించారు.