ETV Bharat / briefs

ఈసీపై విపక్షాల పోరుబాట - రేపు దిల్లీలో ధర్నా

author img

By

Published : May 20, 2019, 10:14 AM IST

Updated : May 20, 2019, 10:22 AM IST

23న జరిగే ఓట్ల లెక్కింపులో మొదట వీవీప్యాట్‌లు లెక్కించాలనే డిమాండ్‌తో రేపు ధర్నా చేయనున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... కౌంటింగ్‌ రోజున మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ విజయంపైనా ధీమా వ్యక్తం చేశారు.

విజయంపై చంద్రబాబు ధీమా

కేంద్ర ఎన్నికల సంఘం వైఖరికి నిరసనగా రేపు దిల్లీలో ధర్నా చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలోని అన్ని భాజపాయేతర పార్టీలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను క్లిష్ట తరం చేసి... వివాదాస్పదంగా మార్చేశారని ఈసీపై మండిపడ్డారు ఆయన. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు... తొలుత వీవీప్యాట్‌లు లెక్కించాలనే డిమాండ్‌తోనే ధర్నా చేస్తున్నట్టు వివరించారు.


వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే
రాష్ట్రంలో తెలుగుదేశం విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తమ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. 18 నుంచి 20 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని అభిప్రాయపడ్డారు. 110 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఖాయమని అది 120 నుంచి 130కి పెరగొచ్చని అంచనా వేశారు. వందకు వంద శాతం తెదేపా ప్రభుత్వం కొలువుదీరుతుందని ఘంటాపథంగా చెప్పారు. మైండ్‌గేమ్స్‌తో గొందరగోళ పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని... ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియపై మరోసారి 22న శిక్షణ ఉంటుందని... మరింత అప్రమత్తత అవసరమని శ్రేణులకు సూచించారు.

మరోసారి దిల్లీకి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కొల్‌కత్తా మీదుగా దిల్లీ వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం బంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతారు. ఫలితాల అనంతరం కేంద్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. అనంతరం కోల్ కత్తా నుంచి నేరుగా దిల్లీ వెళ్తారు. అక్కడ ఎన్డీఏయేతర పార్టీ నేతలతో కలవనున్నారు. రాజకీయాల చర్చతోపాటు కౌంటింగ్ సమయంలో తొలుత వి.వి.ప్యాట్‌లు లెక్కించాలనే డిమాండ్‌పై వివిధ పార్టీల నేతలతో రేపు ఆందోళన చేయనున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం వైఖరికి నిరసనగా రేపు దిల్లీలో ధర్నా చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలోని అన్ని భాజపాయేతర పార్టీలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను క్లిష్ట తరం చేసి... వివాదాస్పదంగా మార్చేశారని ఈసీపై మండిపడ్డారు ఆయన. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు... తొలుత వీవీప్యాట్‌లు లెక్కించాలనే డిమాండ్‌తోనే ధర్నా చేస్తున్నట్టు వివరించారు.


వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే
రాష్ట్రంలో తెలుగుదేశం విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తమ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. 18 నుంచి 20 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని అభిప్రాయపడ్డారు. 110 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఖాయమని అది 120 నుంచి 130కి పెరగొచ్చని అంచనా వేశారు. వందకు వంద శాతం తెదేపా ప్రభుత్వం కొలువుదీరుతుందని ఘంటాపథంగా చెప్పారు. మైండ్‌గేమ్స్‌తో గొందరగోళ పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని... ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియపై మరోసారి 22న శిక్షణ ఉంటుందని... మరింత అప్రమత్తత అవసరమని శ్రేణులకు సూచించారు.

మరోసారి దిల్లీకి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కొల్‌కత్తా మీదుగా దిల్లీ వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం బంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతారు. ఫలితాల అనంతరం కేంద్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. అనంతరం కోల్ కత్తా నుంచి నేరుగా దిల్లీ వెళ్తారు. అక్కడ ఎన్డీఏయేతర పార్టీ నేతలతో కలవనున్నారు. రాజకీయాల చర్చతోపాటు కౌంటింగ్ సమయంలో తొలుత వి.వి.ప్యాట్‌లు లెక్కించాలనే డిమాండ్‌పై వివిధ పార్టీల నేతలతో రేపు ఆందోళన చేయనున్నారు.

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 39

AP_CDP_26_20_DAMPING_YARD_C3


Body:ఏళ్లు గడుస్తున్నా కడప జిల్లాలోని మైదుకూరు పురపాలిక డంపింగ్ యార్డు అభివృద్ధికి నోచుకోలేదు పాలకవర్గం దృష్టి సారించక అధికారులు పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది ఫలితంగా డంపింగ్ యార్డ్ లోనే చెత్త పక్కనే ఉన్న పొలాల్లోకి చేరుతుండడంతో రైతుల ఆందోళన వ్యక్తమవుతోంది చెత్తను దహనం చేయకూడదని జాతీయ హరిత ట్రైబ్యునల్ 2016 డిసెంబర్ 12న ఆదేశించిన డంపింగ్ యార్డులో మాత్రం నిరంతరం చెత్త దహనం అవుతోంది

పురపాలిక పరిధిలోని ఎల్లంపల్లి వద్ద మట్టి తవ్వకాల కోసం తవ్విన గోతులు ఉన్న ప్రాంతాన్ని అధికారులు కేటాయించారు పురపాలక లో సేకరిస్తున్న చెత్తనంతా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నా తేలికపాటి చెత్తతో పాటు ప్లాస్టిక్ కవర్లు గాలులకు పక్కనే ఉన్న పొలాల్లోకి చేరుతోంది పంట సాగు చేసే ప్రతి సారి ప్లాస్టిక్ కవర్లు ఏర్పరచుకోవడం రైతులకు పరిపాటిగా మారుతోంది ప్లాస్టిక్ కవర్లు పొలాల్లోకి చేరకుండా అ చర్యలు తీసుకోవడంలో లో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా డంపింగ్ యార్డుకు కంచ కోసం మూడు లక్షలు దారి సౌకర్యం కోసం మూడు లక్షలు ఖర్చుచేసేందుకు 2014 డిసెంబర్ నెలలోనే పాలక వర్గ ఆమోదం తెలిపిన నిధులు ఖర్చు చేయలేకపోయారు

గతేడాది ఫిబ్రవరి నెలలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ రూ. 34.7 9లక్షలు అభివృద్ధి పనులు చేపట్టలేక పోయారు

డంపింగ్ యార్డ్ లో ని చెత్త నిరంతరం దహనమవుతూ పరిసరాల్లోకి దట్టంగా పొగ లతోపాటు ఉ దుర్వాసన వెదజల్లుతూ ఉండటం తో పనులు చేసేందుకు కూలీలు ముందుకు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చకూడదు అనే నిబంధన ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా పురపాలక అధికారులు చర్యలు తీసుకొని పొలాల్లోకి చెత్త చేరకుండా చెత్త దహనం కాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు

byte: నాగ ప్రసాద్ రెడ్డి, రైతు.
byte: సాంబశివుడు, రైతు.




Conclusion:
Last Updated : May 20, 2019, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.