ETV Bharat / briefs

అపోలోలో అరుదైన శస్త్ర చికిత్స

విశాఖ అపోలో ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. 69 ఏళ్ల వ్యక్తికి... గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

author img

By

Published : Jul 2, 2019, 9:40 PM IST

అపోలో వైద్యుల అరుదైన శస్త్రచికిత్స

విశాఖ అపోలో వైద్యులు అరుదైన గుండె చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ట్రాన్స్ కేథటర్ అర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టవీ)గా పిలిచే చికిత్సను 69 ఏళ్ల వ్యక్తికి అందించి తెలుగు రాష్ట్రాల్లో అరుదైన ఘనతను సాధించారు. ఈ చికిత్సతో బెలూన్ మౌంటెడ్ స్టెంట్ వాల్వ్​ను... చెడిపోయిన అయార్టిక్ వాల్వ్ అనే కవాటము స్థానంలో అమర్చారు. అయార్టిక్ వాల్వ్ అనే కవాటము గుండె నుంచి మొదలై మహాధమని ద్వారం వద్ద ఉండి... మంచి రక్త ప్రసరణను ఒకే మార్గంలో జరిగేట్లుగా నియంత్రిస్తుంది. ఈ పద్ధతిలో తొడభాగము నుంచి చిన్న రంధ్రం చేసి గుండె వరకూ గైడ్ వైర్ సాయంతో బెలూన్ మౌంటెడ్ స్టెంట్ వాల్వ్ పంపించి అమర్చినట్లు కార్డియాలజిస్ట్ డాక్టర్ పాణిగ్రహి తెలిపారు.

అపోలో వైద్యుల అరుదైన శస్త్రచికిత్స

విశాఖ అపోలో వైద్యులు అరుదైన గుండె చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ట్రాన్స్ కేథటర్ అర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టవీ)గా పిలిచే చికిత్సను 69 ఏళ్ల వ్యక్తికి అందించి తెలుగు రాష్ట్రాల్లో అరుదైన ఘనతను సాధించారు. ఈ చికిత్సతో బెలూన్ మౌంటెడ్ స్టెంట్ వాల్వ్​ను... చెడిపోయిన అయార్టిక్ వాల్వ్ అనే కవాటము స్థానంలో అమర్చారు. అయార్టిక్ వాల్వ్ అనే కవాటము గుండె నుంచి మొదలై మహాధమని ద్వారం వద్ద ఉండి... మంచి రక్త ప్రసరణను ఒకే మార్గంలో జరిగేట్లుగా నియంత్రిస్తుంది. ఈ పద్ధతిలో తొడభాగము నుంచి చిన్న రంధ్రం చేసి గుండె వరకూ గైడ్ వైర్ సాయంతో బెలూన్ మౌంటెడ్ స్టెంట్ వాల్వ్ పంపించి అమర్చినట్లు కార్డియాలజిస్ట్ డాక్టర్ పాణిగ్రహి తెలిపారు.

ఇదీ చదవండీ... పండ్లు.. కూరగాయల రైతులకు శుభవార్త

Intro:ap_tpt_51_02_paruvu_hatya_badhitulanu_paraamarsinchina_ex_mp_avb_ap10105

పరువు హత్య బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ హర్ష కుమార్Body:చిత్తూరు జిల్లా .... పలమనేరు నియోజకవర్గం ఊసరపెంటలో జరిగిన పరువు హత్య బాధితులను పరామర్శించడానికి ఉసిరి పెంట గ్రామానికి మాజీ ఎంపీ హర్ష కుమార్ వచ్చారు

మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ పరువు హత్య అత్యంత కిరాతకం అని గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వానికి గాని దళితులంటే చిన్న చూపే అని ఈ పరువు హత్య జరిగి వారం గడుస్తున్నా కనీసం వచ్చి పలకరించి పోయే పాపాన పోలేదని, హోమ్ మినిస్టర్ సుచరిత రావాలి కానీ ఆమె రాలేదు... చిత్తూరు జిల్లాలో ఉన్న డిప్యూటీ సీఎం రావాలి ఆయన కూడా రాలేదని, జిల్లా కలెక్టరు మరియు ఎస్పి వాళ్లు కూడా రాలేదు... అంటే ఇక్కడికి వస్తే అధినేత జగన్ కి ఎక్కడ కోపం వస్తుందో అని రాలేకపోయారేమో అని నేను భావిస్తున్నాను. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీ వచ్చారంట... ఆ పది రోజులు బాబుకి జగన్ పేరు పెట్టండి అని సలహా ఇచ్చి పోయారంట??
అసలు వీరు మనుషులేనా... ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మీ నాయకుడు పేరు పెట్టు కోవాలి అని చెప్పడానికి మీకు నోరు ఎలా వచ్చింది.. అని దుయ్యబట్టారు. ఇక్కడే కాదు బక్కి శీను హత్య జరిగినప్పుడు కూడా కలెక్టర్ రాలేదు, ఎస్పి రాలేదు, మంత్రులు ఎవరూ కూడా రాలేదు, మొక్కుబడిగా ఎమ్మెల్యే ఎంపీలను పంపించారు, అంటే ఈ ప్రభుత్వ విధానం దళితులకు వ్యతిరేకమా??? అని ప్రశ్నించారు.

స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా కూడా దళితులపైన నా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి దీనికి పరిష్కారమే లేదా అన్న ప్రశ్నకు గాను????

దళితులందరూ కూడా జగన్ ను సిఎం చేయాలని ఆయనకన్నా ఎక్కువ కోరుకున్నారని.. చట్టాలు ఎన్ని ఉన్నా కేసులు పెట్టలేదు ఇదంతా దళితులు పైన ఉన్న వివక్షే అని తెలిపారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.