వే బ్రిడ్జి అనుమతి కోసం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ..రాజమహేంద్రవరంలో ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీకి చిక్కాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రామేశంపేటకు చెందిన ఉమాసాయి వేబ్రిడ్జి నిర్మాణ అనుమతి నిమిత్తమై తూనిక- కొలతల శాఖను సంప్రదించాడు. అసిస్టెంట్ కంట్రోలర్ ఈశ్వర్రావు లంచం ఆశించగా..అనిశా అధికారులకు ఫిర్యాదు చేశాడు. పక్కా ప్రణాళికతో లంచగొండి అధికారిని ఏసీబీ అరెస్ట్ చేసింది.లంచం తీసుకుంటూ..అనిశాకు చిక్కిన అధికారి ఇవీ చదవండి....వరుణుడి రాక కోసం... కప్పలకు పెళ్లి