ETV Bharat / bharat

ప్రభుత్వ ప్రిన్సిపల్​ సెక్రెటరీ డేటా హ్యాక్​.. మైనర్, అతని తండ్రి అరెస్ట్​

author img

By

Published : Dec 20, 2022, 7:56 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వ రూరల్​ వాటర్​ సప్లై డిపార్ట్​మెంట్​ ప్రిన్సిపల్​ సెక్రెటరీ డేటా హ్యాక్ అయింది. జల్​ జీవన్​ పథకానికి ఐటీ కన్సల్టెంట్​గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ సైబర్ నేరానికి పాల్పడ్డాడు. నిందితున్ని, అతని మైనర్​ కొడుకును పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులకు సాయం చేసిన మరో ముగ్గురిని సైతం అరెస్ట్​ చేశారు పోలీసులు.

UP govt Principal Secretary data hacked
యూపీ ప్రభుత్వ అధికారి డేటా చోరీ

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వ ప్రిన్సిపల్​ సెక్రెటరీ డేటా హ్యాక్​కు గురైంది. డేటా చోరీకి పాల్పడ్డ ఓ వ్యక్తిని అతని మైనర్​ కొడుకును పోలీసులు అరెస్ట్​ చేశారు. వారికి సహాయం చేసిన మరో ముగ్గురిని సైతం అరెస్ట్​ చేసినట్లు వారు తెలిపారు. ప్రభుత్వ అధికారి డేటాను హ్యాక్​ చేసిన నిందితులు రూ.80 లక్షలను డిమాండ్​ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనురాగ్​ శ్రీవాస్తవ​ రూరల్​ వాటర్​ సప్లై డిపార్ట్​మెంట్​కు ప్రిన్సిపల్​ సెక్రెటరీగా ఉన్నారు. సత్యప్రకాశ్​ అనే వ్యక్తి జల్​ జీవన్​ పథకానికి ఐటీ కన్సల్టెంట్​గా పనిచేస్తున్నాడు. ఇతను బిహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాగా.. ప్రస్తుతం లఖ్​నవూలోని పార్థ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఒకరోజు సత్యప్రకాశ్​.. తన లాప్​టాప్​లో లోపం తలెత్తిందని శ్రీవాస్తవ​ నుంచి లాగిన్​ పాస్​వర్డ్​ను తీసుకున్నాడు. అదే సమయంలో శ్రీవాస్తవ​, అతని కుటుంబ సభ్యుల ఈ-మెయిల్​ ఐడీలను హ్యాక్​ చేశాడు. అనంతరం ఈ మెయిళ్ల ద్వారా వారందరిని బెదిరిస్తూ.. డబ్బులు డిమాండ్​ చేశాడు.

డేటా చోరీలో సత్యప్రకాశ్​కు సహాయం చేసిన అమిత్ ప్రతాప్ సింగ్, రజనీశ్ నిగమ్, హార్దిక్ ఖన్నాలను సైతం అరెస్ట్​ చేశారు పోలీసులు. వీరంతా రూరల్​ వాటర్​ సప్లై డిపార్ట్​మెంట్​లో కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. "నిందితులు శ్రీవాస్తవ క్రెడిట్​ కార్డునూ హ్యాక్​ చేశారు. లఖ్​నవూలోని వివిధ ప్రాంతాల్లో క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోళ్లు చేశారు. సాంకేతిక ఆధారాలు, గ్యాడ్జెట్‌లలోని వివరాలను బట్టి నిందితులను అరెస్ట్​ చేశాం" అని సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్​స్పెక్టర్ ముస్లిం ఖాన్ తెలిపారు. ఇంత తక్కువ డబ్బుకు ప్రిన్సిపల్ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేయరేమో అనుకొని తాము భావించామని విచారణలో సత్యప్రకాశ్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వ ప్రిన్సిపల్​ సెక్రెటరీ డేటా హ్యాక్​కు గురైంది. డేటా చోరీకి పాల్పడ్డ ఓ వ్యక్తిని అతని మైనర్​ కొడుకును పోలీసులు అరెస్ట్​ చేశారు. వారికి సహాయం చేసిన మరో ముగ్గురిని సైతం అరెస్ట్​ చేసినట్లు వారు తెలిపారు. ప్రభుత్వ అధికారి డేటాను హ్యాక్​ చేసిన నిందితులు రూ.80 లక్షలను డిమాండ్​ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనురాగ్​ శ్రీవాస్తవ​ రూరల్​ వాటర్​ సప్లై డిపార్ట్​మెంట్​కు ప్రిన్సిపల్​ సెక్రెటరీగా ఉన్నారు. సత్యప్రకాశ్​ అనే వ్యక్తి జల్​ జీవన్​ పథకానికి ఐటీ కన్సల్టెంట్​గా పనిచేస్తున్నాడు. ఇతను బిహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాగా.. ప్రస్తుతం లఖ్​నవూలోని పార్థ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఒకరోజు సత్యప్రకాశ్​.. తన లాప్​టాప్​లో లోపం తలెత్తిందని శ్రీవాస్తవ​ నుంచి లాగిన్​ పాస్​వర్డ్​ను తీసుకున్నాడు. అదే సమయంలో శ్రీవాస్తవ​, అతని కుటుంబ సభ్యుల ఈ-మెయిల్​ ఐడీలను హ్యాక్​ చేశాడు. అనంతరం ఈ మెయిళ్ల ద్వారా వారందరిని బెదిరిస్తూ.. డబ్బులు డిమాండ్​ చేశాడు.

డేటా చోరీలో సత్యప్రకాశ్​కు సహాయం చేసిన అమిత్ ప్రతాప్ సింగ్, రజనీశ్ నిగమ్, హార్దిక్ ఖన్నాలను సైతం అరెస్ట్​ చేశారు పోలీసులు. వీరంతా రూరల్​ వాటర్​ సప్లై డిపార్ట్​మెంట్​లో కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. "నిందితులు శ్రీవాస్తవ క్రెడిట్​ కార్డునూ హ్యాక్​ చేశారు. లఖ్​నవూలోని వివిధ ప్రాంతాల్లో క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోళ్లు చేశారు. సాంకేతిక ఆధారాలు, గ్యాడ్జెట్‌లలోని వివరాలను బట్టి నిందితులను అరెస్ట్​ చేశాం" అని సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్​స్పెక్టర్ ముస్లిం ఖాన్ తెలిపారు. ఇంత తక్కువ డబ్బుకు ప్రిన్సిపల్ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేయరేమో అనుకొని తాము భావించామని విచారణలో సత్యప్రకాశ్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.