ETV Bharat / bharat

దట్టమైన పొగమంచు.. అదుపుతప్పి లోయలో పడ్డ వాహనం.. ముగ్గురు సైనికులు మృతి

author img

By

Published : Jan 11, 2023, 9:46 AM IST

Updated : Jan 11, 2023, 11:35 AM IST

జమ్ముకశ్మీర్​లో దట్టమైన పొగమంచు కురవడం వల్ల జవాన్ల వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మరణించారు. బుధవారం జరిగిందీ ఘటన.

three army soldiers die in Machhal Sector
three army soldiers die in Machhal Sector

జమ్ముకశ్మీర్​లోని కూప్వారా జిల్లాలోని మచ్​హల్ సెక్టార్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద దట్టమైన పొగ మంచు కారణంగా జవాన్ల వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు. నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆర్మీ అధికారులు బుధవారం తెలిపారు
"పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో జేసీఓతో పాటు మరో ఇద్దరు సైనికులు ఉన్న వాహనం లోయలోకి పడింది. ట్రాక్​పై దట్టమైన మంచు కురవడం వల్లే ఈ ఘటన జరిగింది" అని శ్రీనగర్‌ పోలీసులు ట్వీట్​ చేశారు.

జమ్ముకశ్మీర్​లోని కూప్వారా జిల్లాలోని మచ్​హల్ సెక్టార్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద దట్టమైన పొగ మంచు కారణంగా జవాన్ల వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు. నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆర్మీ అధికారులు బుధవారం తెలిపారు
"పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో జేసీఓతో పాటు మరో ఇద్దరు సైనికులు ఉన్న వాహనం లోయలోకి పడింది. ట్రాక్​పై దట్టమైన మంచు కురవడం వల్లే ఈ ఘటన జరిగింది" అని శ్రీనగర్‌ పోలీసులు ట్వీట్​ చేశారు.

Last Updated : Jan 11, 2023, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.