ETV Bharat / bharat

కాంగ్రెస్​ సీనియర్​ నేత అహ్మద్​ పటేల్​ కన్నుమూత

author img

By

Published : Nov 25, 2020, 4:58 AM IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత అహ్మద్​ పటేల్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు ఫైజల్​ పటేల్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

Senior Congress leader Ahmed Patel
కాంగ్రెస్​ సీనియర్​ నేత అహ్మద్​ పటేల్

కాంగ్రెస్​ సీనియర్​ నేత, గుజరాత్​కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్​ (71).. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు ఫైజల్​ ట్విటర్​ ద్వారా వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడి.. పలు అవయవాలు దెబ్బతిన్నట్లు చెప్పారు.

71 ఏళ్ల పటేల్​ తాను కొవిడ్​ బారిన పడినట్లు అక్టోబర్​ 1న ట్విటర్​ ద్వారా తెలిపారు. అనంతరం నవంబర్​ 15న ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.

కాంగ్రెస్​ సీనియర్​ నేత, గుజరాత్​కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్​ (71).. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు ఫైజల్​ ట్విటర్​ ద్వారా వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడి.. పలు అవయవాలు దెబ్బతిన్నట్లు చెప్పారు.

71 ఏళ్ల పటేల్​ తాను కొవిడ్​ బారిన పడినట్లు అక్టోబర్​ 1న ట్విటర్​ ద్వారా తెలిపారు. అనంతరం నవంబర్​ 15న ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.