ETV Bharat / bharat

నీతి ఆయోగ్‌ భేటీకి నితీశ్‌ గైర్హాజరు.. ఏంటి కథ?

author img

By

Published : Aug 7, 2022, 3:38 PM IST

Updated : Aug 7, 2022, 7:25 PM IST

NITI Aayog Meeting: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశమైంది. దిల్లీలో నిర్వహించిన ఈ భేటీలో జాతీయ నూతన విద్యావిధానం, పంటల మార్పిడి అజెండాలుగా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​ గైర్హాజరయ్యారు.

PM Modi chairs NITI Aayogs governing council meeting
PM Modi chairs NITI Aayogs governing council meeting

NITI Aayog Meeting: జాతీయ విద్యా విధానం అమలు(ఎన్​ఈపీ), పంటల వైవిధ్యం, పట్టణాభివృద్ధి సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశమైంది. దిల్లీ రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్​ షా, నితిన్​ గడ్కరీ, రాజ్​నాథ్​ సింగ్​, ఎస్​ జైశంకర్​ కూడా హాజయ్యారు.
2019 జులైలో జరిగిన నీతి ఆయోగ్​ సమావేశం తర్వాత పాలక మండలి సభ్యులు భౌతికంగా హాజరవడం ఇదే తొలిసారి. ఈ మూడేళ్లు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా భేటీలు జరిగాయి. 2020లో కరోనా వైరస్​ నేపథ్యంలో నీతి ఆయోగ్​ సమావేశం కాలేదు. 2015 ఫిబ్రవరి 8న తొలి భేటీ జరిగింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​.. ఈ సమావేశాలకు దూరంగా ఉన్నారు. నీతి ఆయోగ్​ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసీఆర్.. సమావేశాలను బహిష్కరించారు. జాతీయ ప్రణాళిక సంఘానికి ప్రత్యామ్నాయంగా ఎన్​డీఏ ప్రభుత్వం తెచ్చిన నీతి ఆయోగ్​తో ఉపయోగం లేదని, నీతి ఆయోగ్​లో నీతి లేదని విమర్శించారు. నీతి ఆయోగ్​ను నిరర్థకంగా మార్చిన వైఖరికి నిరసనగా భేటీకి వెళ్లట్లేదని స్పష్టం చేశారు.

మరోవైపు నితీశ్​ కుమార్​ కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నితీశ్​ నేతృత్వంలోని జేడీయూ.. కేంద్రంలో, బిహార్​లో జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామి. అయితే.. మిత్రపక్షాల మధ్య దూరం పెరిగినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ముఖ్యంగా.. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. అవన్నీ తోసిపుచ్చుతూ ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకే జేడీయూ మద్దతు ఇచ్చింది. ఇంతలోనే.. నీతి ఆయోగ్ భేటీకి నితీశ్​ వెళ్లకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

భాజపాతో బానే ఉంది.. కానీ!
భాజపాతో దూరం పెరిగిందన్న ఊహాగానాల నేపథ్యంలో స్పందించారు జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్​ రంజన్​ సింగ్​. భాజపాతో ప్రస్తుతం బానే ఉందని అన్నారు. అయితే.. మరోసారి జేడీయూ కేంద్ర మంత్రివర్గంలో భాగం కాబోదని వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్​ సమావేశానికి సీఎం ఎందుకు హాజరుకాలేదన్న ప్రశ్నకు.. అది నితీశ్​నే అడిగితే బాగుంటుందని అన్నారు రాజీవ్​. కరోనా నుంచి ఇటీవలే కోలుకున్న నితీశ్​ ఆ కారణంతోనే.. నీతి ఆయోగ్​ భేటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జేడీయూ నేత ఆర్​సీపీ సింగ్​ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. దీనిపైనా స్పందించిన రాజీవ్​.. కొంతమంది జేడీయూకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని, అదెప్పటికీ సాధ్యం కాదని అన్నారు. జేడీయూ మునిగే నావ ఎన్నటికీ కాబోదని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవీ చూడండి: పెద్దలసభకు 'సమయం' నేర్పిన నేత.. పారదర్శకతకు పెద్దపీట

లార్డ్ మౌంట్​బాటెన్.. వలస పాలన ముగించిన వీరుడా?.. అగ్గిరాజేసిన విలనా?

NITI Aayog Meeting: జాతీయ విద్యా విధానం అమలు(ఎన్​ఈపీ), పంటల వైవిధ్యం, పట్టణాభివృద్ధి సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశమైంది. దిల్లీ రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్​ షా, నితిన్​ గడ్కరీ, రాజ్​నాథ్​ సింగ్​, ఎస్​ జైశంకర్​ కూడా హాజయ్యారు.
2019 జులైలో జరిగిన నీతి ఆయోగ్​ సమావేశం తర్వాత పాలక మండలి సభ్యులు భౌతికంగా హాజరవడం ఇదే తొలిసారి. ఈ మూడేళ్లు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా భేటీలు జరిగాయి. 2020లో కరోనా వైరస్​ నేపథ్యంలో నీతి ఆయోగ్​ సమావేశం కాలేదు. 2015 ఫిబ్రవరి 8న తొలి భేటీ జరిగింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​.. ఈ సమావేశాలకు దూరంగా ఉన్నారు. నీతి ఆయోగ్​ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసీఆర్.. సమావేశాలను బహిష్కరించారు. జాతీయ ప్రణాళిక సంఘానికి ప్రత్యామ్నాయంగా ఎన్​డీఏ ప్రభుత్వం తెచ్చిన నీతి ఆయోగ్​తో ఉపయోగం లేదని, నీతి ఆయోగ్​లో నీతి లేదని విమర్శించారు. నీతి ఆయోగ్​ను నిరర్థకంగా మార్చిన వైఖరికి నిరసనగా భేటీకి వెళ్లట్లేదని స్పష్టం చేశారు.

మరోవైపు నితీశ్​ కుమార్​ కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నితీశ్​ నేతృత్వంలోని జేడీయూ.. కేంద్రంలో, బిహార్​లో జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామి. అయితే.. మిత్రపక్షాల మధ్య దూరం పెరిగినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ముఖ్యంగా.. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. అవన్నీ తోసిపుచ్చుతూ ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకే జేడీయూ మద్దతు ఇచ్చింది. ఇంతలోనే.. నీతి ఆయోగ్ భేటీకి నితీశ్​ వెళ్లకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

భాజపాతో బానే ఉంది.. కానీ!
భాజపాతో దూరం పెరిగిందన్న ఊహాగానాల నేపథ్యంలో స్పందించారు జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్​ రంజన్​ సింగ్​. భాజపాతో ప్రస్తుతం బానే ఉందని అన్నారు. అయితే.. మరోసారి జేడీయూ కేంద్ర మంత్రివర్గంలో భాగం కాబోదని వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్​ సమావేశానికి సీఎం ఎందుకు హాజరుకాలేదన్న ప్రశ్నకు.. అది నితీశ్​నే అడిగితే బాగుంటుందని అన్నారు రాజీవ్​. కరోనా నుంచి ఇటీవలే కోలుకున్న నితీశ్​ ఆ కారణంతోనే.. నీతి ఆయోగ్​ భేటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జేడీయూ నేత ఆర్​సీపీ సింగ్​ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. దీనిపైనా స్పందించిన రాజీవ్​.. కొంతమంది జేడీయూకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని, అదెప్పటికీ సాధ్యం కాదని అన్నారు. జేడీయూ మునిగే నావ ఎన్నటికీ కాబోదని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవీ చూడండి: పెద్దలసభకు 'సమయం' నేర్పిన నేత.. పారదర్శకతకు పెద్దపీట

లార్డ్ మౌంట్​బాటెన్.. వలస పాలన ముగించిన వీరుడా?.. అగ్గిరాజేసిన విలనా?

Last Updated : Aug 7, 2022, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.