ETV Bharat / bharat

డీఎన్​ఏ పరీక్షలతో నేతాజీ మరణం మిస్టరీని ఛేదించండి

author img

By

Published : Aug 16, 2022, 7:53 AM IST

జపాన్‌ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉంచిన నేతాజీ అస్థికలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆయన కుమార్తె అనితా బోస్. మృతిపై ఇప్పటికీ కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్‌ఏ పరీక్ష సమాధానాలు ఇస్తుందన్నారు.

netaji death mystery
డీఎన్​ఏ పరీక్షలతో నేతాజీ మరణం మిస్టరీని ఛేదించండి

Netaji death mystery : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలను భారత్‌కు తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్‌ పేర్కొన్నారు. 1945, ఆగస్టు 18న ఆయన మరణించగా.. మృతిపై ఇప్పటికీ కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్‌ఏ పరీక్ష సమాధానాలు ఇస్తుందన్నారు. ప్రస్తుతం జపాన్‌ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉంచిన నేతాజీ అస్థికలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించేందుకూ జపాన్‌ ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని అనితా బోస్‌ గుర్తుచేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారత్‌ ఘనంగా జరుపుకుంటోన్న వేళ.. నేతాజీ కుమార్తె అనితా బోస్‌ ఈ ప్రకటన చేశారు.

'అస్థికల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి.. అధునాతన సాంకేతికతతో వాటిని విశ్లేషించవచ్చు. 1945 ఆగస్టులో నేతాజీ చనిపోయారని చెబుతున్నా.. వాటిపై కొందరికి అనుమానాలు ఉన్నాయి. రెంకోజీ ఆలయంలో ఉన్న నమూనాలకు డీఎన్‌ఏ పరీక్ష చేయడంవల్ల వారి అనుమానాలను శాస్త్రీయంగా నివృత్తి చేసే వీలు కలుగుతుంది' అని అనితా బోస్‌ పేర్కొన్నారు. అటువంటి పరీక్షకు రెంకోజీ ఆలయ పూజారితోపాటు జపాన్‌ ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. నేతాజీకి భారత స్వాతంత్ర్యం కంటే ఏమీ ఎక్కువ కాదన్న ఆమె.. స్వాతంత్య్ర ఫలాలను భారత్‌ అనుభవిస్తోన్న వేళ వాటిని చూసేందుకు నేతాజీ బతికిలేరన్నారు. ఇటువంటి సమయంలోనైనా కనీసం ఆయన అస్థికలను భారత గడ్డకు తీసుకుచ్చేందుకు కృషి చేద్దామని.. అందుకు ఇదే సరైన సమయమని అనితా బోస్‌ పిలుపునిచ్చారు.

భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించిన వారిలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ప్రముఖులు. ఈ క్రమంలో ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే మారింది. అయితే, 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు పలు దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా నేతాజీ మరణంపై భారత ప్రభుత్వం వేసిన రెండు దర్యాప్తు కమిషన్‌లు.. ఆయన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు చెప్పగా, జస్టిస్‌ ఎంకే ముఖర్జీ నేతృత్వంలోని కమిషన్‌ మాత్రం వాటితో విబేధించింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా నేతాజీ బతికే ఉన్నారని పేర్కొంది. దీంతో నేతాజీ మరణం, రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు నేతాజీవా? కావా? అన్న విషయం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.

ఇదిలాఉంటే, భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా యూరప్‌ నుంచి ఉద్యమాన్ని కొనసాగించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌.. 1930 దశకంలో ఎమిలీ షెంకెల్‌తో ప్రేమలో పడ్డట్లు చెబుతుంటారు. ఆ దంపతులకు పుట్టిన బిడ్డే అనితా బోస్‌. ఆస్ట్రియాలో పుట్టిన అనితా బోస్‌ ప్రస్తుతం జర్మనీలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వయసు 79 ఏళ్లు. ఆర్థికవేత్తగా, సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ నేతగా జర్మనీలో అనితా బోస్‌ పేరు సంపాదించారు.

Netaji death mystery : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలను భారత్‌కు తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్‌ పేర్కొన్నారు. 1945, ఆగస్టు 18న ఆయన మరణించగా.. మృతిపై ఇప్పటికీ కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్‌ఏ పరీక్ష సమాధానాలు ఇస్తుందన్నారు. ప్రస్తుతం జపాన్‌ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉంచిన నేతాజీ అస్థికలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించేందుకూ జపాన్‌ ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని అనితా బోస్‌ గుర్తుచేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారత్‌ ఘనంగా జరుపుకుంటోన్న వేళ.. నేతాజీ కుమార్తె అనితా బోస్‌ ఈ ప్రకటన చేశారు.

'అస్థికల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి.. అధునాతన సాంకేతికతతో వాటిని విశ్లేషించవచ్చు. 1945 ఆగస్టులో నేతాజీ చనిపోయారని చెబుతున్నా.. వాటిపై కొందరికి అనుమానాలు ఉన్నాయి. రెంకోజీ ఆలయంలో ఉన్న నమూనాలకు డీఎన్‌ఏ పరీక్ష చేయడంవల్ల వారి అనుమానాలను శాస్త్రీయంగా నివృత్తి చేసే వీలు కలుగుతుంది' అని అనితా బోస్‌ పేర్కొన్నారు. అటువంటి పరీక్షకు రెంకోజీ ఆలయ పూజారితోపాటు జపాన్‌ ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. నేతాజీకి భారత స్వాతంత్ర్యం కంటే ఏమీ ఎక్కువ కాదన్న ఆమె.. స్వాతంత్య్ర ఫలాలను భారత్‌ అనుభవిస్తోన్న వేళ వాటిని చూసేందుకు నేతాజీ బతికిలేరన్నారు. ఇటువంటి సమయంలోనైనా కనీసం ఆయన అస్థికలను భారత గడ్డకు తీసుకుచ్చేందుకు కృషి చేద్దామని.. అందుకు ఇదే సరైన సమయమని అనితా బోస్‌ పిలుపునిచ్చారు.

భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించిన వారిలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ప్రముఖులు. ఈ క్రమంలో ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే మారింది. అయితే, 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు పలు దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా నేతాజీ మరణంపై భారత ప్రభుత్వం వేసిన రెండు దర్యాప్తు కమిషన్‌లు.. ఆయన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు చెప్పగా, జస్టిస్‌ ఎంకే ముఖర్జీ నేతృత్వంలోని కమిషన్‌ మాత్రం వాటితో విబేధించింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా నేతాజీ బతికే ఉన్నారని పేర్కొంది. దీంతో నేతాజీ మరణం, రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు నేతాజీవా? కావా? అన్న విషయం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.

ఇదిలాఉంటే, భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా యూరప్‌ నుంచి ఉద్యమాన్ని కొనసాగించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌.. 1930 దశకంలో ఎమిలీ షెంకెల్‌తో ప్రేమలో పడ్డట్లు చెబుతుంటారు. ఆ దంపతులకు పుట్టిన బిడ్డే అనితా బోస్‌. ఆస్ట్రియాలో పుట్టిన అనితా బోస్‌ ప్రస్తుతం జర్మనీలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వయసు 79 ఏళ్లు. ఆర్థికవేత్తగా, సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ నేతగా జర్మనీలో అనితా బోస్‌ పేరు సంపాదించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.