ETV Bharat / bharat

సీఎం పర్యటనకు ముందు బాంబు బెదిరింపు!

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath)​. నవంబర్​ 11న మేరఠ్​ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఆయన పర్యటనకు ముందు మేరఠ్​ రైల్వే స్టేషన్​ను బాంబులతో(bomb threat news) పేల్చివేస్తామని దుండగులు లేఖ రాయటం కలకలం సృష్టిస్తోంది.

author img

By

Published : Nov 10, 2021, 10:13 AM IST

Updated : Nov 10, 2021, 11:43 AM IST

Meerut railway station
మేరఠ్​ స్టేషన్​లో తనిఖీలు

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ (Yogi Adityanath) మేరఠ్​ పర్యటనకు ముందు బాంబు బెదిరింపులు(bomb threat news) కలకలం సృష్టిస్తున్నాయి. ఈనెల 11న (గురువారం) మేరఠ్​కు వెళ్లనున్నారు సీఎం. ఈ క్రమంలోనే మేరఠ్​​ రైల్వే స్టేషన్​ను బాంబుతో పేల్చివేస్తామని స్టేషన్​ మాస్టర్​కు లేఖ అందినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Meerut railway station
బెదిరింపు లేఖ

లేఖ అందిన వెంటనే స్టేషన్​ మాస్టర్​ పోలీసులకు సమాచారం అందించారని అధికారులు తెలిపారు. స్టేషన్​ మొత్తం అణువణువూ తనిఖీ చేశామని, ఎలాంటి అనుమానిత వస్తువు లభించలేదన్నారు. బాంబు బెదిరింపులు(bomb threat news) వచ్చిన క్రమంలో పశ్చిమ ఉత్తర్​ ప్రదేశ్​ జిల్లాలను అలర్ట్​ చేశారు.

బాంబు బెదిరింపుల నేపథ్యంలో స్టేషన్​తో పాటు రైళ్లలో తనిఖీలు చేపట్టి, భద్రతను కట్టుదిట్టం చేశారు రైల్వే అధికారులు. గాజియాబాద్​, హపుర్​, బులంద్​షెహర్​, షామ్లి, సహరాన్​పుర్​, ముజఫర్​నగర్​, మొరాదాబాద్​ సహా ఇతర జిల్లాల్లోని రైల్వే స్టేషన్లలో బలగాలను మోహరించారు.

ఇదీ చూడండి: 'లఖింపుర్​ ఘటన'పై యోగి సర్కార్​కు నిరసన సెగ

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ (Yogi Adityanath) మేరఠ్​ పర్యటనకు ముందు బాంబు బెదిరింపులు(bomb threat news) కలకలం సృష్టిస్తున్నాయి. ఈనెల 11న (గురువారం) మేరఠ్​కు వెళ్లనున్నారు సీఎం. ఈ క్రమంలోనే మేరఠ్​​ రైల్వే స్టేషన్​ను బాంబుతో పేల్చివేస్తామని స్టేషన్​ మాస్టర్​కు లేఖ అందినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Meerut railway station
బెదిరింపు లేఖ

లేఖ అందిన వెంటనే స్టేషన్​ మాస్టర్​ పోలీసులకు సమాచారం అందించారని అధికారులు తెలిపారు. స్టేషన్​ మొత్తం అణువణువూ తనిఖీ చేశామని, ఎలాంటి అనుమానిత వస్తువు లభించలేదన్నారు. బాంబు బెదిరింపులు(bomb threat news) వచ్చిన క్రమంలో పశ్చిమ ఉత్తర్​ ప్రదేశ్​ జిల్లాలను అలర్ట్​ చేశారు.

బాంబు బెదిరింపుల నేపథ్యంలో స్టేషన్​తో పాటు రైళ్లలో తనిఖీలు చేపట్టి, భద్రతను కట్టుదిట్టం చేశారు రైల్వే అధికారులు. గాజియాబాద్​, హపుర్​, బులంద్​షెహర్​, షామ్లి, సహరాన్​పుర్​, ముజఫర్​నగర్​, మొరాదాబాద్​ సహా ఇతర జిల్లాల్లోని రైల్వే స్టేషన్లలో బలగాలను మోహరించారు.

ఇదీ చూడండి: 'లఖింపుర్​ ఘటన'పై యోగి సర్కార్​కు నిరసన సెగ

Last Updated : Nov 10, 2021, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.