ETV Bharat / bharat

ల్యాప్‌టాప్‌ బుక్‌ చేస్తే రాయి వచ్చింది.. పార్సిల్‌ ఓపెన్​ చేసి ఖంగుతిన్న వినియోగదారుడు

author img

By

Published : Oct 25, 2022, 10:51 PM IST

కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన వ్యక్తి ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లో ల్యాప్‌టాప్‌ ఆర్డర్‌ చేయగా.. పార్సిల్‌ కవర్లో రాయి, కొంత ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు వచ్చాయి. ఎట్టకేలకు అతి కష్టం మీద తన డబ్బును తిరిగిపొందాడు.

man-ordered-laptop-from-flipkart-got-stone-in-delivery
ల్యాప్‌టాప్‌ బుక్‌ చేస్తే పార్సిల్‌లో రాయి

ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో మొబైల్‌ బుక్‌ చేస్తే.. పార్సిల్‌ కవర్లో చిన్నపాటి రాళ్లు వచ్చాయన్న వార్తలు వినే ఉంటాం. కానీ, ఈ సారి, ఆ అనుభవం ల్యాప్‌టాప్‌ బుక్‌చేసుకున్న వ్యక్తికి ఎదురైంది. ల్యాప్‌టాప్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వ్యక్తికి రాయితోపాటు కొంత ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు ప్యాకింగ్‌లో దర్శనమివ్వడంతో ఖంగుతిన్నాడు.

దీపావళి ఆఫర్లు ఉన్నాయన్న ఉద్దేశంతో కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి కోసం అక్టోబరు 15న ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లో ల్యాప్‌టాప్‌ ఆర్డర్‌ చేశాడు. తీరా పార్సిల్‌ వచ్చాక తెరచి చూస్తే.. అందులో రాయి, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు ఉన్నాయి. వెంటనే కస్టమర్‌కేర్‌కి ఫోన్‌ చేసి సమస్యను చెప్పినా తొలుత ఉపయోగం లేకపోయింది. ఎట్టకేలకు అతికష్టం మీద డబ్బును తిరిగి పొందాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సదరు వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్‌గా మారాయి.

ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ కావడంతో.. ఈ కామర్స్‌ సంస్థలు ‘ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ’ ఆప్షన్‌ను తీసుకొచ్చాయి. కస్టమర్‌ కోరితే.. ఐటమ్‌ డెలివరీ చేసేముందు డెలివరీ చేసే వ్యక్తి పార్సిల్‌ను తెరిచి చూపించాల్సి ఉంటుంది. అయితే, ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసినప్పుడే వినియోగదారుడు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తాజా ఘటనలో ఆ వ్యక్తి ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోలేదు. పార్సిల్‌లో రాయి వచ్చిందన్న సంగతి గమనించి..వెంటనే అమ్మకం దారుడికి ఫోన్‌చేసి విషయం చెప్పాడు. అయితే, ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ ఎంచుకోనందున రిఫండ్‌ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పడంతో.. తాను ఆర్డర్‌ చేసిన ఈ కామర్స్‌ సంస్థకు ఫిర్యాదు చేశాడు. అన్ని ఆధారాలు జత చేస్తూ ఈమెయిల్‌ చేశాడు. సదరు ఈ కామర్స్‌ సంస్థ జోక్యం చేసుకోవడంతో మొత్తం సొమ్మును రిఫండ్‌ వచ్చింది.

ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో మొబైల్‌ బుక్‌ చేస్తే.. పార్సిల్‌ కవర్లో చిన్నపాటి రాళ్లు వచ్చాయన్న వార్తలు వినే ఉంటాం. కానీ, ఈ సారి, ఆ అనుభవం ల్యాప్‌టాప్‌ బుక్‌చేసుకున్న వ్యక్తికి ఎదురైంది. ల్యాప్‌టాప్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వ్యక్తికి రాయితోపాటు కొంత ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు ప్యాకింగ్‌లో దర్శనమివ్వడంతో ఖంగుతిన్నాడు.

దీపావళి ఆఫర్లు ఉన్నాయన్న ఉద్దేశంతో కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి కోసం అక్టోబరు 15న ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లో ల్యాప్‌టాప్‌ ఆర్డర్‌ చేశాడు. తీరా పార్సిల్‌ వచ్చాక తెరచి చూస్తే.. అందులో రాయి, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు ఉన్నాయి. వెంటనే కస్టమర్‌కేర్‌కి ఫోన్‌ చేసి సమస్యను చెప్పినా తొలుత ఉపయోగం లేకపోయింది. ఎట్టకేలకు అతికష్టం మీద డబ్బును తిరిగి పొందాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సదరు వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్‌గా మారాయి.

ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ కావడంతో.. ఈ కామర్స్‌ సంస్థలు ‘ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ’ ఆప్షన్‌ను తీసుకొచ్చాయి. కస్టమర్‌ కోరితే.. ఐటమ్‌ డెలివరీ చేసేముందు డెలివరీ చేసే వ్యక్తి పార్సిల్‌ను తెరిచి చూపించాల్సి ఉంటుంది. అయితే, ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసినప్పుడే వినియోగదారుడు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తాజా ఘటనలో ఆ వ్యక్తి ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోలేదు. పార్సిల్‌లో రాయి వచ్చిందన్న సంగతి గమనించి..వెంటనే అమ్మకం దారుడికి ఫోన్‌చేసి విషయం చెప్పాడు. అయితే, ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ ఎంచుకోనందున రిఫండ్‌ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పడంతో.. తాను ఆర్డర్‌ చేసిన ఈ కామర్స్‌ సంస్థకు ఫిర్యాదు చేశాడు. అన్ని ఆధారాలు జత చేస్తూ ఈమెయిల్‌ చేశాడు. సదరు ఈ కామర్స్‌ సంస్థ జోక్యం చేసుకోవడంతో మొత్తం సొమ్మును రిఫండ్‌ వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.