ETV Bharat / bharat

జైలు ఎదుట బిడ్డ మృతదేహంతో తల్లి ఆవేదన, భర్త కోసం 7 గంటలు నిరీక్షించి

author img

By

Published : Aug 16, 2022, 8:17 PM IST

ఆ మహిళ గర్భం దాల్చానని ఎంతో సంబరపడింది. కానీ ఈలోపే తన భర్తను పోలీసులు అరెస్ట్​ చేశారు. లోపల ఎంతో బాధ ఉన్నా ధైర్యంగా ఉంటూ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఆనందం ఎంతోసేపు ఉండలేదు. అనారోగ్యంతో బిడ్డ చనిపోయాడు. కనీసం పిల్లాడి మృతదేహాన్ని అయినా భర్తకు చూపిద్దామని జైలుకు వెళ్లింది. 7 గంటలకు పైగా అధికారులను వేడుకుంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ బతిమిలాడినా అధికారులు లోపలకి అనుమతించలేదు. వివరాల్లోకి వెళితే

jail-manual-hindered-last-glimpse-of-dead-son-in-chatra
jail-manual-hindered-last-glimpse-of-dead-son-in-chatra

ఝార్ఖండ్​లోని ఛత్రా జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. నవజాత శిశువు మృతదేహాన్ని జైలుశిక్ష అనుభవిస్తున్న తన భర్తకు కడసారి చూపించేందుకు వెళ్లిన మహిళకు ఆవేదనే మిగిలింది. జైలు ప్రధాన ద్వారం వద్ద 7 గంటలకు పైగా వేచి చూసినప్పటికీ అధికారులు కరుణించలేదు. ఒక్కసారి తన భర్తను కలవడానికి అవకాశం ఇవ్వమని కన్నీరుమున్నీరుగా విలపించినా.. ఒక్క అధికారి కూడా స్పందించలేదు.

అసలేం జరిగిందంటే..?
వశిష్ట్ నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని బందర్చువాన్ గ్రామానికి చెందిన చుమన్​ మహ భార్య ఫూల్​ దేవి శుక్రవారం రాత్రి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆమె కుటుంబసభ్యులు సంబరపడుతున్న వేళ శనివారం రాత్రి ఉన్నట్టుండి నవజాత శిశువు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అయితే ఫూల్ దేవిది మారుమూల గ్రామం కావడం వల్ల సరైన రవాణా సౌకర్యం లేక ఆ రాత్రిపూట ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు. రాత్రంతా పిల్లవాడ్ని జాగ్రత్తగా చూసుకుంటూ గడిపారు. ఆదివారం పొద్దున్న.. నవజాత శిశువును ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధరించారు.

jail-manual-hindered-last-glimpse-of-dead-son-in-chatra
జైలు బయట కొడుకు మృతదేహంతో ఫూల్ దేవి

అయితే ఫూల్​ దేవి భర్త చుమన్​ మహ గత ఏడు నెలలుగా ఓ కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనభవిస్తున్నాడు. కొడుకు మృతదేహాన్ని భర్తకు కడసారి చూపించేందుకు ఫూల్​ దేవి జైలుకు బయలుదేరింది. ఆదివారం ఉదయం 8 గంటలకు జైలు ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంది. బిడ్డ మృతదేహం పట్టుకుని రోధిస్తూ తన భర్తను ఒక్కసారి కలవడానికి అవకాశం ఇవ్వాలని అధికారులను కోరింది. అయినా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు. ఎంత బతిమిలాడినా ఫూల్​ దేవిని లోపలకి అనుమతించలేదు. చివరకు చేసేదేమి లేక నవజాత శిశువు అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు.

అయితే ఈ ఘటనపై ఛత్రా జైలు అధికారి దినేష్ వర్మ స్పందించారు. ఒక మహిళ తన బిడ్డ మృతదేహంతో జైలు గేటు వద్ద రోధిస్తున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే డివిజనల్ జైలు సూపరింటెండెంట్‌కు విషయం తెలిపామన్నారు. కానీ జైలు నియమాల ప్రకారం ఆదివారం ఖైదీలను ఎవరూ కలిసే అవకాశం లేనందున, ఆ మహిళ తన భర్తను కలవలేకపోయిందని చెప్పారు.

ఇవీ చదవండి: తలాక్​పై సుప్రీం కీలక వ్యాఖ్యలు, ఆ రెండూ ఒకటి కాదంటూ

బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదలపై వివాదం, విపక్షాలు ఫైర్

ఝార్ఖండ్​లోని ఛత్రా జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. నవజాత శిశువు మృతదేహాన్ని జైలుశిక్ష అనుభవిస్తున్న తన భర్తకు కడసారి చూపించేందుకు వెళ్లిన మహిళకు ఆవేదనే మిగిలింది. జైలు ప్రధాన ద్వారం వద్ద 7 గంటలకు పైగా వేచి చూసినప్పటికీ అధికారులు కరుణించలేదు. ఒక్కసారి తన భర్తను కలవడానికి అవకాశం ఇవ్వమని కన్నీరుమున్నీరుగా విలపించినా.. ఒక్క అధికారి కూడా స్పందించలేదు.

అసలేం జరిగిందంటే..?
వశిష్ట్ నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని బందర్చువాన్ గ్రామానికి చెందిన చుమన్​ మహ భార్య ఫూల్​ దేవి శుక్రవారం రాత్రి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆమె కుటుంబసభ్యులు సంబరపడుతున్న వేళ శనివారం రాత్రి ఉన్నట్టుండి నవజాత శిశువు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అయితే ఫూల్ దేవిది మారుమూల గ్రామం కావడం వల్ల సరైన రవాణా సౌకర్యం లేక ఆ రాత్రిపూట ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు. రాత్రంతా పిల్లవాడ్ని జాగ్రత్తగా చూసుకుంటూ గడిపారు. ఆదివారం పొద్దున్న.. నవజాత శిశువును ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధరించారు.

jail-manual-hindered-last-glimpse-of-dead-son-in-chatra
జైలు బయట కొడుకు మృతదేహంతో ఫూల్ దేవి

అయితే ఫూల్​ దేవి భర్త చుమన్​ మహ గత ఏడు నెలలుగా ఓ కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనభవిస్తున్నాడు. కొడుకు మృతదేహాన్ని భర్తకు కడసారి చూపించేందుకు ఫూల్​ దేవి జైలుకు బయలుదేరింది. ఆదివారం ఉదయం 8 గంటలకు జైలు ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంది. బిడ్డ మృతదేహం పట్టుకుని రోధిస్తూ తన భర్తను ఒక్కసారి కలవడానికి అవకాశం ఇవ్వాలని అధికారులను కోరింది. అయినా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు. ఎంత బతిమిలాడినా ఫూల్​ దేవిని లోపలకి అనుమతించలేదు. చివరకు చేసేదేమి లేక నవజాత శిశువు అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు.

అయితే ఈ ఘటనపై ఛత్రా జైలు అధికారి దినేష్ వర్మ స్పందించారు. ఒక మహిళ తన బిడ్డ మృతదేహంతో జైలు గేటు వద్ద రోధిస్తున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే డివిజనల్ జైలు సూపరింటెండెంట్‌కు విషయం తెలిపామన్నారు. కానీ జైలు నియమాల ప్రకారం ఆదివారం ఖైదీలను ఎవరూ కలిసే అవకాశం లేనందున, ఆ మహిళ తన భర్తను కలవలేకపోయిందని చెప్పారు.

ఇవీ చదవండి: తలాక్​పై సుప్రీం కీలక వ్యాఖ్యలు, ఆ రెండూ ఒకటి కాదంటూ

బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదలపై వివాదం, విపక్షాలు ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.