టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో (India vs Pakistan T20) భారత్ ఘోర పరాజయం తర్వాత.. పంజాబ్ సంగ్రూర్లోని ఓ కళాశాల హాస్టల్లో ఉద్రిక్తత తలెత్తింది. కశ్మీర్కు చెందిన విద్యార్థులతో.. బిహార్, యూపీ విద్యార్థులు ఘర్షణ పడ్డారు.

ఆదివారం రాత్రి కశ్మీర్, యూపీ, బిహార్కు చెందిన విద్యార్థులు తమ తమ గదులలో మ్యాచ్ (India vs Pakistan T20 world cup) వీక్షించారని పోలీసులు తెలిపారు. మ్యాచ్ ముగిసిన తర్వాత పలువురు విద్యార్థులు నినాదాలు చేశారని వెల్లడించారు. దీంతో విద్యార్థుల మధ్య వాదన మొదలైందని చెప్పారు.

ఈ వాదన క్రమంగా దాడులకు దారి తీసినట్లు తెలుస్తోంది. కశ్మీరీ విద్యార్థులపై, యూపీ, బిహార్ విద్యార్థులు దాడి చేశారని సమాచారం. అనంతరం వివాదం సద్దుమణిగిందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.
వీడియోలు వైరల్
దాడికి సంబంధించినవిగా చెబుతున్న పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. యూపీ విద్యార్థులు తమ గదుల్లోకి వచ్చి, గొడవ పడ్డారని కశ్మీరీ విద్యార్థులు ఆరోపించారు. తమ గదుల్లోని వస్తువులను ధ్వంసం చేశారని అన్నారు.
ఇదీ చదవండి: IND VS PAK: టీమ్ఇండియా ఓటమికి కారణాలు ఇవేనా..!