ETV Bharat / bharat

'సభ్యుల తీరుకు నిరసనగా డిప్యూటీ ఛైర్మన్ ఉపవాసం'

author img

By

Published : Sep 22, 2020, 12:23 PM IST

సెప్టెంబర్​ 20న రాజ్యసభలో కొంతమంది విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు తనకు అత్యంత బాధ కలిగించిందని పెద్దల సభ డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్​ అన్నారు. వారి అనుచిత ప్రవర్తనకు నిరసనగా 24 గంటలపాటు ఉపవాసం ఉంటున్నట్లు ఛైర్మన్​ వెంకయ్యనాయుడికి లేఖ రాశారు.

RS Deputy Chairman
'ఆ రోజు తలచుకుంటే రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు'

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్​ 24 గంటల పాటు ఉపవాసం ఉండనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్​ 20న వ్యవసాయ సంస్కరణల బిల్లులపై చర్చ సందర్భంగా కొంత మంది విపక్ష ఎంపీలు తనతో వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడికి ఆయన లేఖ రాశారు.

RS Deputy Chairman
హరివంశ్​ లేఖ
RS Deputy Chairman
హరివంశ్​ లేఖ
RS Deputy Chairman
హరివంశ్​ లేఖ

"గత రెండు రోజులుగా నేను చాలా బాధగా, దుఃఖంగా ఉన్నాను. ఎంతో మనోవేదనను అనుభవిస్తున్నాను. సెప్టెంబర్​ 20న రాజ్యసభలో జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. ప్రజాస్వామ్యం పేరిట కొంతమంది సభ్యులు ఎంతో అనుచితంగా ప్రవర్తించారు. పెద్దల సభ నియమ నిబంధనలను వారు అతిక్రమించారు. రూల్​ బుక్​ను చింపి నా మీదకు విసిరారు. నా ఎదురుగా ఉన్న బల్లపై కొంతమంది నిల్చొని అసభ్య పదజాలంతో నన్ను దూషించారు. ఆ ఘటన పదేపదే నాకు గుర్తుకు వస్తుంది. కనీసం నిద్రపోలేకపోతున్నాను. వారి ప్రవర్తనకు నిరసనగా ఒక్కరోజు పాటు ఉపవాసం ఉంటున్నాను."

- హరివంశ్​, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్

ఇదీ చూడండి: రాజ్యసభ సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు

రాష్ట్రపతికి లేఖ..

సదరు ఎంపీలు తనతో వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు హరివంశ్​ లేఖ రాశారు. వారు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం అన్నారు.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్​ 24 గంటల పాటు ఉపవాసం ఉండనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్​ 20న వ్యవసాయ సంస్కరణల బిల్లులపై చర్చ సందర్భంగా కొంత మంది విపక్ష ఎంపీలు తనతో వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడికి ఆయన లేఖ రాశారు.

RS Deputy Chairman
హరివంశ్​ లేఖ
RS Deputy Chairman
హరివంశ్​ లేఖ
RS Deputy Chairman
హరివంశ్​ లేఖ

"గత రెండు రోజులుగా నేను చాలా బాధగా, దుఃఖంగా ఉన్నాను. ఎంతో మనోవేదనను అనుభవిస్తున్నాను. సెప్టెంబర్​ 20న రాజ్యసభలో జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. ప్రజాస్వామ్యం పేరిట కొంతమంది సభ్యులు ఎంతో అనుచితంగా ప్రవర్తించారు. పెద్దల సభ నియమ నిబంధనలను వారు అతిక్రమించారు. రూల్​ బుక్​ను చింపి నా మీదకు విసిరారు. నా ఎదురుగా ఉన్న బల్లపై కొంతమంది నిల్చొని అసభ్య పదజాలంతో నన్ను దూషించారు. ఆ ఘటన పదేపదే నాకు గుర్తుకు వస్తుంది. కనీసం నిద్రపోలేకపోతున్నాను. వారి ప్రవర్తనకు నిరసనగా ఒక్కరోజు పాటు ఉపవాసం ఉంటున్నాను."

- హరివంశ్​, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్

ఇదీ చూడండి: రాజ్యసభ సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు

రాష్ట్రపతికి లేఖ..

సదరు ఎంపీలు తనతో వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు హరివంశ్​ లేఖ రాశారు. వారు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.