నవరాత్రి పూజలు ప్రారంభమైన సందర్భంగా మంగళవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పండగ వేళ ఇరు నేతలూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం సుమారు గంటసేపు ఇరు నేతలు సమావేశమయ్యారు.
అమెరికా పర్యటన విశేషాలను మోదీ ఉపరాష్ట్రతికి వివరించారు. వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కుమార్తె దీప, కుటుంబ సభ్యులతో మోదీ కొంత సమయం గడిపారు.
ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి