ETV Bharat / bharat

రాత్రి వేళ విజయవంతంగా పృథ్వీ-2 పరీక్ష

author img

By

Published : Sep 24, 2020, 11:53 AM IST

అణ్వాయుధాలను మోసుకెళ్లే సత్తా ఉన్న పృథ్వీ-2 క్షిపణి పరీక్షలను సైన్యం నిర్వహించింది. రాత్రి వేళ ఈ క్షిపణి ప్రయోగం నిర్వహించినట్లు డీఆర్​డీఓ తెలిపింది. చీకట్లో క్షిపణి తీరును పర్యవేక్షించినట్లు వెల్లడించింది. ఈ ప్రయోజం విజయవంతంగా ముగిసినట్లు పేర్కొంది.

Indigenously developed Prithvi-II missile testfired
పృథ్వీ-2 క్షిపణి రాత్రి పరీక్షలు విజయవంతం

స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పృథ్వీ-2 అణ్వస్త్ర క్షిపణిని రాత్రి పూట పరీక్షించింది భారత సైన్యం. డీఆర్​డీఓ పర్యవేక్షణలో ఒడిశాలోని బాలాసోర్​ నుంచి ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.

చాందీపుర్​ సమీపంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజీ నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు డీఆర్​డీఓ అధికారులు తెలిపారు. లాంచ్ కాంప్లెక్స్-3 నుంచి ఓ మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణిని పరీక్షించినట్లు వెల్లడించారు. చివరిసారిగా 2019 నవంబర్ 20న పృథ్వీ క్షిపణిని చీకటిలో పరీక్షించినట్లు చెప్పారు.

ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని.. క్షిపణి వెళ్లే మార్గాన్ని రాడార్లు, ఎలెక్ట్రో ట్రాకింగ్ సిస్టమ్​ల ద్వారా పరిశీలించామని డీఆర్​డీఓ అధికారులు తెలిపారు.

లిక్విడ్ ప్రొపల్షన్​ ఇంధనంతో రెండు ఇంజిన్​లు కలిగిన పృథ్వీ-2 క్షిపణి 500-1000 కిలోల వార్​హెడ్లను మోసుకెళ్లగలదు. లక్ష్యాలను చేధించడానికి అధునాతన ట్రాజెక్టరీ వ్యవస్థ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్​ ద్వారా పృథ్వీ క్షిపణిని 2003లో సైన్యానికి అందించింది డీఆర్​డీఓ.

స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పృథ్వీ-2 అణ్వస్త్ర క్షిపణిని రాత్రి పూట పరీక్షించింది భారత సైన్యం. డీఆర్​డీఓ పర్యవేక్షణలో ఒడిశాలోని బాలాసోర్​ నుంచి ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.

చాందీపుర్​ సమీపంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజీ నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు డీఆర్​డీఓ అధికారులు తెలిపారు. లాంచ్ కాంప్లెక్స్-3 నుంచి ఓ మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణిని పరీక్షించినట్లు వెల్లడించారు. చివరిసారిగా 2019 నవంబర్ 20న పృథ్వీ క్షిపణిని చీకటిలో పరీక్షించినట్లు చెప్పారు.

ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని.. క్షిపణి వెళ్లే మార్గాన్ని రాడార్లు, ఎలెక్ట్రో ట్రాకింగ్ సిస్టమ్​ల ద్వారా పరిశీలించామని డీఆర్​డీఓ అధికారులు తెలిపారు.

లిక్విడ్ ప్రొపల్షన్​ ఇంధనంతో రెండు ఇంజిన్​లు కలిగిన పృథ్వీ-2 క్షిపణి 500-1000 కిలోల వార్​హెడ్లను మోసుకెళ్లగలదు. లక్ష్యాలను చేధించడానికి అధునాతన ట్రాజెక్టరీ వ్యవస్థ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్​ ద్వారా పృథ్వీ క్షిపణిని 2003లో సైన్యానికి అందించింది డీఆర్​డీఓ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.