ETV Bharat / bharat

స్వదేశీ 'ఫార్మా'కు జై.. కేంద్రం మార్గదర్శకాలు!

భారత ఫార్మా రంగానికి పలు మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. వైద్య పరికరాలు, ఔషధాల కోసం మరో దేశంపై ఆధారపడే అవసరం లేకుండా ఫార్మా పార్కుల ఏర్పాటుకు తెరతీసింది. కొత్త పథకాలకు ఎంపికయ్యేందుకు కంపెనీలకు కావలసిన అర్హతలు వెల్లడించింది.

author img

By

Published : Jul 27, 2020, 10:04 PM IST

Govt releases guidelines for schemes to boost domestic manufacturing of bulk drugs, med devices
స్వదేశీ 'ఫార్మా'కు కేంద్రం మార్గదర్శకాలు!

భారత ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తూ.. స్వదేశీ ఔషధాలు, వైద్య పరికరాల ఉత్పత్తులు పెంపొందించే నాలుగు పథకాల మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'ఆత్మ నిర్భర్' ఆశయాలకు అనుగుణంగా.. ఫార్మా రంగంలో ఈ కొత్త పథకాలను రూపొందించినట్లు తెలిపారు కేంద్ర రసాయన, ఎరువుల శాఖా మంత్రి డీవీ సదానంద గౌడ.

ఇప్పటి వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 53 యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కేఎస్ ఎమ్) సహా పలు వైద్య ఉత్పత్తి పరికరాలను ఇకపై భారత్​లోనే తయారు చేయడానికి కొత్త పథకాలు దోహదపడతాయన్నారు. ఔషధాల కోసం మరో దేశంపై ఆధారపడే అవసరం లేకుండా చేస్తాయన్నారు సదానంద.

  • It gives me immense pleasure to release the guidelines of four schemes for development of Bulk Drug & medical device parks across the country. pic.twitter.com/isM4gwNmEH

    — Sadananda Gowda (@DVSadanandGowda) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రస్తుతం 40 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫార్మా రంగం విలువ.. 2024 వరకల్లా 100 బిలియన్ డాలర్లు వృద్ధి చెందుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను 2025 వరకల్లా... 5 ట్రిలియన్ డాలర్లు చేయాలన్న్ ప్రధాని ఆశయం నెరవేర్చడానిగి తోడ్పడుతుంది. ఈ పథకాలు ఫార్మా రంగం దశదిశలు పూర్తిగా మార్చేస్తాయి. అందుకే, పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వాలు సహా వాటాదారులతో లోతైన సంప్రదింపులు జరిపిన తరువాతే ఈ మార్గదర్శకాలు రూపొందించాం. "

- డీవీ సదానంద గౌడ, కేంద్ర రసాయన, ఎరువుల శాఖా మంత్రి

పథకం-ప్రయోజనం

  • ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకంలో కొన్ని ఫార్మా కంపెనీలను ఎంపిక చేసి దేశవ్యాప్తంగా ఫార్మా పార్కులు ఏర్పాటు చేస్తారు.
  • ఈ పార్కులు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.
  • యావత్ ప్రపంచానికి భారతీయ ఔషధాలు ఎగుమతి చేయగలవు.

ఎంపిక ఎలా?

  • అర్హతగల ఉత్పత్తిదారులు మాత్రమే పీఎల్​ఐ పథకానికి ఎంపికవుతారు.
  • ఫార్మా పార్కుల్లో భాగమవ్వాలంటే ఆ కంపెనీలు గణనీయమైన పెట్టుబడులు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకర్షించగలగాలి.
  • కొత్త యూనిట్లు నిర్మించడానికి... అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అద్భుతమైన కనెక్టివిటీ, విశాల ప్రాంగణం, పరిశోధన అభివృద్ధి వ్యవస్థతో కూడిన ప్లగ్ అండ్ ప్లే మోడల్ పరిశ్రమలై ఉండాలి.
  • కొత్త తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి సమయం, పెట్టుబడులు తగ్గించే వసతులు ఉండాలి.

ఇదీ చదవండి: ఒడిశాలో 'కొవాగ్జిన్​​' క్లినికల్​ ట్రయల్స్

భారత ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తూ.. స్వదేశీ ఔషధాలు, వైద్య పరికరాల ఉత్పత్తులు పెంపొందించే నాలుగు పథకాల మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'ఆత్మ నిర్భర్' ఆశయాలకు అనుగుణంగా.. ఫార్మా రంగంలో ఈ కొత్త పథకాలను రూపొందించినట్లు తెలిపారు కేంద్ర రసాయన, ఎరువుల శాఖా మంత్రి డీవీ సదానంద గౌడ.

ఇప్పటి వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 53 యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కేఎస్ ఎమ్) సహా పలు వైద్య ఉత్పత్తి పరికరాలను ఇకపై భారత్​లోనే తయారు చేయడానికి కొత్త పథకాలు దోహదపడతాయన్నారు. ఔషధాల కోసం మరో దేశంపై ఆధారపడే అవసరం లేకుండా చేస్తాయన్నారు సదానంద.

  • It gives me immense pleasure to release the guidelines of four schemes for development of Bulk Drug & medical device parks across the country. pic.twitter.com/isM4gwNmEH

    — Sadananda Gowda (@DVSadanandGowda) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రస్తుతం 40 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫార్మా రంగం విలువ.. 2024 వరకల్లా 100 బిలియన్ డాలర్లు వృద్ధి చెందుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను 2025 వరకల్లా... 5 ట్రిలియన్ డాలర్లు చేయాలన్న్ ప్రధాని ఆశయం నెరవేర్చడానిగి తోడ్పడుతుంది. ఈ పథకాలు ఫార్మా రంగం దశదిశలు పూర్తిగా మార్చేస్తాయి. అందుకే, పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వాలు సహా వాటాదారులతో లోతైన సంప్రదింపులు జరిపిన తరువాతే ఈ మార్గదర్శకాలు రూపొందించాం. "

- డీవీ సదానంద గౌడ, కేంద్ర రసాయన, ఎరువుల శాఖా మంత్రి

పథకం-ప్రయోజనం

  • ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకంలో కొన్ని ఫార్మా కంపెనీలను ఎంపిక చేసి దేశవ్యాప్తంగా ఫార్మా పార్కులు ఏర్పాటు చేస్తారు.
  • ఈ పార్కులు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.
  • యావత్ ప్రపంచానికి భారతీయ ఔషధాలు ఎగుమతి చేయగలవు.

ఎంపిక ఎలా?

  • అర్హతగల ఉత్పత్తిదారులు మాత్రమే పీఎల్​ఐ పథకానికి ఎంపికవుతారు.
  • ఫార్మా పార్కుల్లో భాగమవ్వాలంటే ఆ కంపెనీలు గణనీయమైన పెట్టుబడులు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకర్షించగలగాలి.
  • కొత్త యూనిట్లు నిర్మించడానికి... అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అద్భుతమైన కనెక్టివిటీ, విశాల ప్రాంగణం, పరిశోధన అభివృద్ధి వ్యవస్థతో కూడిన ప్లగ్ అండ్ ప్లే మోడల్ పరిశ్రమలై ఉండాలి.
  • కొత్త తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి సమయం, పెట్టుబడులు తగ్గించే వసతులు ఉండాలి.

ఇదీ చదవండి: ఒడిశాలో 'కొవాగ్జిన్​​' క్లినికల్​ ట్రయల్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.