ETV Bharat / bharat

రోజుకు 24కి.మీ సైకిల్​ తొక్కుతూ విజయ తీరాలకు...

author img

By

Published : Jul 5, 2020, 6:04 PM IST

బస్సు, ఆటో, కారు ఇలా అన్ని వసతులు ఉన్నా.. కొందరు విద్యార్థులు బడికి వెళ్లాలంటే మారాం చేస్తారు. కానీ, రోజూ మండుటెండల్లో, కుండపోత వర్షాల్లో దాదాపు 24 కి.మీ సైకిల్​ తొక్కతూ.. బడికి వెళ్లేది మధ్యప్రదేశ్​కు చెందిన ఓ విద్యార్థి. పేదరికం ఎన్ని కష్టాలు పెట్టినా.. ఇష్టంగా చదువుకుంది. పదో తరగతిలో 98.5% మార్కులు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది.

Fighting all odds, Madhya Pradesh Roshni who cycles 24km to school and back secures 98.5%
రోజుకు 24 కి.మీ సైకిల్​ తొక్కి.. విజయాన్ని చేజిక్కించుకుంది!

సాధించాలన్న తపన.. కష్టపడే తత్వం ఉంటే విజయం మన వశమవ్వక తప్పదని మరోసారి నిరూపించింది మధ్యప్రదేశ్​కు చెందిన రోషిణి భదౌరియా. ఉన్నత చదువులు చదవాలన్న సంకల్పంతో ప్రతిరోజు 24 కి.మీ సైకిల్​ తొక్కి.. పదో తరగతి పరీక్షల్లో 98.5% మార్కులు సాధించి సత్తా చాటింది.

fighting-all-odds-madhya-pradesh-girl-who-cycles-24km-to-school-and-back-secures-98-dot-5-percent
రోజుకు 24 కి.మీ సైకిల్​ తొక్కి.. విజయాన్ని చేజిక్కించుకుంది!

నాన్న భుజాల నుంచి సైకిల్​ పైకి..​

భిండ్​ జిల్లా అజ్నోల్​కు చెందిన ఓ నిరుపేద రైతు కుటుంబంలో పుట్టింది రోషిణి. తండ్రి పురుషోత్తం భదౌరియా, తల్లి సరిత భౌదరియా ఎంతో కష్టపడి రోషిణిని చదివిస్తున్నారు. ఆ గ్రామంలో ఉన్నత పాఠశాల లేనందున ఊరికి 12 కి.మీల దూరంలో ఉన్న మెహ్​గావ్​ పట్టణంలోని ఓ బడిలో రోషిణిని చేర్చారు.

fighting-all-odds-madhya-pradesh-girl-who-cycles-24km-to-school-and-back-secures-98-dot-5-percent
రోజుకు 24 కి.మీ సైకిల్​ తొక్కి.. విజయాన్ని చేజిక్కించుకుంది!

ఆ గ్రామానికి కొన్నేళ్ల క్రితం కనీసం సరైన రోడ్డు మార్గం కూడా లేదు. అయినా.. కూతురిని చదివించాలన్న ఒకే ఆశయంతో.. తన భుజాలపై రోషిణిని బడి వరకు మోసుకెళ్లేవాడు పురుషోత్తం. వంతెన నిర్మించాక జిల్లా అధికారులు రోషిణికి ఓ సైకిలిచ్చారు. అప్పటి నుంచి రోజూ ఆ సైకిల్​పైనే బడికి వెళ్లేది రోషిణి. ఒక్కోసారి భారీ వర్షాల కారణంగా ఇంటికి రాలేకపోతే.. దారిలో తాత ఇంటికి వెళ్లిపోయేది.

రోజూ 24 కి.మీ...

fighting-all-odds-madhya-pradesh-girl-who-cycles-24km-to-school-and-back-secures-98-dot-5-percent
రోజుకు 24 కి.మీ సైకిల్​ తొక్కి.. విజయాన్ని చేజిక్కించుకుంది!

అలా రోజూ బడికి వెళ్లడానికి 12 కి.మీ, తిరిగి ఇంటికి చేరుకోడానికి 12 కి.మీ మొత్తం 24 కి.మీ సైకిల్​ తొక్కిన రోషిణి.. దృఢ సంకల్పంతో పదో తరగతి బోర్డ్​ పరీక్షల్లో 98.5% మార్కులు సాధించింది. ఇప్పటివరకు ఆ గ్రామంలో ఎవరికీ దక్కని విజయాన్ని తమ కూతురు సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు రోషిణి తల్లిదండ్రులు.

తన ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను పరీక్షలు బాగా రాశానంటోంది రోషిణి.

fighting-all-odds-madhya-pradesh-girl-who-cycles-24km-to-school-and-back-secures-98-dot-5-percent
రోజుకు 24 కి.మీ సైకిల్​ తొక్కి.. విజయాన్ని చేజిక్కించుకుంది!

"నాకు చాలా సంతోషంగా ఉంది. నేనెప్పుడూ అనుకోలేదు 98.5% మార్కులు సాధిస్తానని. ఎలాంటి ఒడుదొడుకులొచ్చినా చదువుపై దృష్టి పెట్టాను. పరీక్షలు బాగా రాశాను. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు నన్నెంతో ప్రోత్సహించారు. ఇక నాన్న ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు. నేను బాగా చదివి ఐఏఎస్​ అధికారి​ అవ్వాలన్నది నా కల. ఇంటర్​ పూర్తి చేశాక ఆ వైపుగా శిక్షణ తీసుకుంటా. "

-రోషిణి భదౌరియా

ఇదీ చదవండి: యువత మేలుకో.. పొదుపు మార్గం ఎంచుకో

సాధించాలన్న తపన.. కష్టపడే తత్వం ఉంటే విజయం మన వశమవ్వక తప్పదని మరోసారి నిరూపించింది మధ్యప్రదేశ్​కు చెందిన రోషిణి భదౌరియా. ఉన్నత చదువులు చదవాలన్న సంకల్పంతో ప్రతిరోజు 24 కి.మీ సైకిల్​ తొక్కి.. పదో తరగతి పరీక్షల్లో 98.5% మార్కులు సాధించి సత్తా చాటింది.

fighting-all-odds-madhya-pradesh-girl-who-cycles-24km-to-school-and-back-secures-98-dot-5-percent
రోజుకు 24 కి.మీ సైకిల్​ తొక్కి.. విజయాన్ని చేజిక్కించుకుంది!

నాన్న భుజాల నుంచి సైకిల్​ పైకి..​

భిండ్​ జిల్లా అజ్నోల్​కు చెందిన ఓ నిరుపేద రైతు కుటుంబంలో పుట్టింది రోషిణి. తండ్రి పురుషోత్తం భదౌరియా, తల్లి సరిత భౌదరియా ఎంతో కష్టపడి రోషిణిని చదివిస్తున్నారు. ఆ గ్రామంలో ఉన్నత పాఠశాల లేనందున ఊరికి 12 కి.మీల దూరంలో ఉన్న మెహ్​గావ్​ పట్టణంలోని ఓ బడిలో రోషిణిని చేర్చారు.

fighting-all-odds-madhya-pradesh-girl-who-cycles-24km-to-school-and-back-secures-98-dot-5-percent
రోజుకు 24 కి.మీ సైకిల్​ తొక్కి.. విజయాన్ని చేజిక్కించుకుంది!

ఆ గ్రామానికి కొన్నేళ్ల క్రితం కనీసం సరైన రోడ్డు మార్గం కూడా లేదు. అయినా.. కూతురిని చదివించాలన్న ఒకే ఆశయంతో.. తన భుజాలపై రోషిణిని బడి వరకు మోసుకెళ్లేవాడు పురుషోత్తం. వంతెన నిర్మించాక జిల్లా అధికారులు రోషిణికి ఓ సైకిలిచ్చారు. అప్పటి నుంచి రోజూ ఆ సైకిల్​పైనే బడికి వెళ్లేది రోషిణి. ఒక్కోసారి భారీ వర్షాల కారణంగా ఇంటికి రాలేకపోతే.. దారిలో తాత ఇంటికి వెళ్లిపోయేది.

రోజూ 24 కి.మీ...

fighting-all-odds-madhya-pradesh-girl-who-cycles-24km-to-school-and-back-secures-98-dot-5-percent
రోజుకు 24 కి.మీ సైకిల్​ తొక్కి.. విజయాన్ని చేజిక్కించుకుంది!

అలా రోజూ బడికి వెళ్లడానికి 12 కి.మీ, తిరిగి ఇంటికి చేరుకోడానికి 12 కి.మీ మొత్తం 24 కి.మీ సైకిల్​ తొక్కిన రోషిణి.. దృఢ సంకల్పంతో పదో తరగతి బోర్డ్​ పరీక్షల్లో 98.5% మార్కులు సాధించింది. ఇప్పటివరకు ఆ గ్రామంలో ఎవరికీ దక్కని విజయాన్ని తమ కూతురు సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు రోషిణి తల్లిదండ్రులు.

తన ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను పరీక్షలు బాగా రాశానంటోంది రోషిణి.

fighting-all-odds-madhya-pradesh-girl-who-cycles-24km-to-school-and-back-secures-98-dot-5-percent
రోజుకు 24 కి.మీ సైకిల్​ తొక్కి.. విజయాన్ని చేజిక్కించుకుంది!

"నాకు చాలా సంతోషంగా ఉంది. నేనెప్పుడూ అనుకోలేదు 98.5% మార్కులు సాధిస్తానని. ఎలాంటి ఒడుదొడుకులొచ్చినా చదువుపై దృష్టి పెట్టాను. పరీక్షలు బాగా రాశాను. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు నన్నెంతో ప్రోత్సహించారు. ఇక నాన్న ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు. నేను బాగా చదివి ఐఏఎస్​ అధికారి​ అవ్వాలన్నది నా కల. ఇంటర్​ పూర్తి చేశాక ఆ వైపుగా శిక్షణ తీసుకుంటా. "

-రోషిణి భదౌరియా

ఇదీ చదవండి: యువత మేలుకో.. పొదుపు మార్గం ఎంచుకో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.