ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: మూడు నెలల పింఛను​ ఒకేసారి ​వస్తుంది!

author img

By

Published : Mar 27, 2020, 6:03 PM IST

కరోనా లాక్​డౌన్​ సమయంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు మూడు నెలల పెన్షన్​ను ముందుగానే చెల్లించనుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్​ నెల మొదటి వారంలోనే మూడు నెలల పెన్షన్​ లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానుంది.

Elderly, differently-abled, widows to get 3 months' pension in advance
మూడు నెలల పెన్షన్​ ఒకేసారి ​వస్తుంది!

దాదాపు 3 కోట్లమంది లబ్ధిదారులకు.. మూడు నెలల పెన్షన్​ ముందుగానే చెల్లించేలా నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకు భరోసా ఇస్తోంది.​

జాతీయ సామాజిక సహకార కార్యక్రమం (ఎన్​ఎస్​ఏపీ)లో భాగంగా పింఛను​ పొందుతున్న 2.98 కోట్ల మంది లబ్ధిదారులకు మూడు నెలల పెన్షన్ మొత్తాన్ని ఏప్రిల్​ నెలలోనే బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది కేంద్రం.

ప్రస్తుతం 60 నుంచి 79 ఏళ్ల లోపున్న వృద్ధులకు రూ.200/- పెన్షన్​ సహకారం అందిస్తున్న కేంద్రం.. 79 ఏళ్ల లోపు వితంతువులకు, దివ్యాంగులకు రూ.300/- చొప్పున ఇస్తోంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.500/- చొప్పున చెల్లిస్తోంది.

వీటితో పాటు రానున్న 3 నెలల పాటు.. రూ.1000/- పరిహారాన్ని అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు. ఈ పరిహారం రెండు దఫాలుగా బ్యాంకులో జమచేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఐపీఎల్​ ఫైనల్​కన్నా మోదీ 'లాక్​డౌన్​ స్పీచ్'​కే అధిక రేటింగ్​

దాదాపు 3 కోట్లమంది లబ్ధిదారులకు.. మూడు నెలల పెన్షన్​ ముందుగానే చెల్లించేలా నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకు భరోసా ఇస్తోంది.​

జాతీయ సామాజిక సహకార కార్యక్రమం (ఎన్​ఎస్​ఏపీ)లో భాగంగా పింఛను​ పొందుతున్న 2.98 కోట్ల మంది లబ్ధిదారులకు మూడు నెలల పెన్షన్ మొత్తాన్ని ఏప్రిల్​ నెలలోనే బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది కేంద్రం.

ప్రస్తుతం 60 నుంచి 79 ఏళ్ల లోపున్న వృద్ధులకు రూ.200/- పెన్షన్​ సహకారం అందిస్తున్న కేంద్రం.. 79 ఏళ్ల లోపు వితంతువులకు, దివ్యాంగులకు రూ.300/- చొప్పున ఇస్తోంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.500/- చొప్పున చెల్లిస్తోంది.

వీటితో పాటు రానున్న 3 నెలల పాటు.. రూ.1000/- పరిహారాన్ని అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు. ఈ పరిహారం రెండు దఫాలుగా బ్యాంకులో జమచేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఐపీఎల్​ ఫైనల్​కన్నా మోదీ 'లాక్​డౌన్​ స్పీచ్'​కే అధిక రేటింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.