ETV Bharat / bharat

లాక్​డౌన్​ వేళ అంబులెన్స్​లో 3,213 కి.మీల ప్రయాణం! - ambulance from Chennai to tripura

లాక్​డౌన్​ సమయంలో సొంత గూటికి చేరేందుకు ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. చెన్నైలో చిక్కుకున్న త్రిపురకు చెందిన ఓ జంట అంబులెన్స్​లో 3 వేల కిలోమీటర్లు ప్రయాణించి స్వగ్రామానికి చేరుకుంటే.. పక్కదేశం నేపాల్​ నుంచి సైకిల్​పై స్వదేశానికి వస్తూ ఇద్దరు భారతీయులు మృతి చెందారు.

Family from Tripura travels over 3,000 km in ambulance from Chennai
లాక్​డౌన్​ వేళ అంబులెన్స్​లో 3,213 కి.మీల ప్రయాణం!
author img

By

Published : Apr 21, 2020, 6:38 PM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ సామాన్యులను ఆపసోపాలు పెడుతోంది. ఇంటికి దూరంగా ఇరుక్కుపోయి.. ఇక్కట్లు పడుతున్నవారు స్వగ్రామాలకు చేరేందుకు సాహసాలే చేస్తున్నారు. త్రిపురకు చెందిన దంపతులు చెన్నైలో చిక్కుకుని.. ఎప్పుడో నిశ్చయించుకన్న కూతురు పెళ్లి చేసేందుకు 3000 కి.మీ అంబులెన్స్​లో ప్రయాణం చేశారు.​

ఇక నేపాల్​ నుంచి సైకిల్​పై ఇంటికి వస్తూ ప్రాణాలే విడిచారు ఇద్దరు భారతీయులు.

​అంత దూరం అంబులెన్స్​లోనే..

త్రిపుర గోమతి జిల్లా, ఉదయ్​పుర్​కు చెందిన చంచల్​ మజుమ్దార్​.. భార్య అషీమాకు చికిత్స చేయించేందుకు చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. చికిత్స పూర్తయినా లాక్​డౌన్​తో రవాణా సౌకర్యాలు లేని కారణంగా తిరిగి ఇంటికి వెళ్లలేకపోయారు ఆ దంపతులు. ఊరుకానీ ఊరిలో తిండికి తిప్పలు పడుతూ కాలం గడిపారు. మరోవైపు, వచ్చె నెల కుమార్తె పెళ్లి నిశ్చయమైంది. అందుకే, ఏదేమైనా సరేనని అంబులెన్స్​లోనే 3,213 కి.మీ ప్రయాణించి ఉదయపుర్​కు చేరుకున్నారు.

"మేము అపోలో హాస్పిటల్​కు వెళ్లాము. అక్కడ నా భార్యకు ఆపరేషన్​ జరిగింది. ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యే సమయానికి లాక్​డౌన్​ ప్రకటించింది ప్రభుత్వం. అక్కడే ఉండాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతే, కాదు వచ్చే నెల 8వ తేదిన నా కుమార్తె వివాహం ఉంది. అందుకే, అంబులెన్స్ అద్దెకు తీసుకుని ఇంటికి రావలసివచ్చింది."

-మజుమ్దార్​

సుదీర్ఘ అంబులెన్స్​ ప్రయాణంలో.. తమిళనాడు, ఒడిశా, బంగాల్​, అసోం, మేఘాలయా, త్రిపుర సరిహద్దుల్లో ఆసుపత్రి పత్రాలను చూపించాల్సి వచ్చింది మజుమ్దార్​. అదే వాహనంలో త్రిపురకు చెందిన మరో పేషంట్​ను కూడా స్వగ్రామానికి చేర్చారు ఆ దంపతులు.

ప్రస్తుతం ఆ ముగ్గురూ ఉదయ్​పుర్​లోని ఓ క్వారంటైన్ కేంద్రం​లో ఉన్నారని గోమతి జిల్లా మేజిస్ట్రేట్​ తరుణ్​ కాంతి దేవ్​నాథ్​ తెలిపారు.

"ఎన్నో రాష్ట్రాలు, కరోనా ప్రభావిత ప్రాంతాలను దాటి వచ్చారు. కాబట్టి, వారిని మేము నిర్బంధ కేంద్రానికి తరలించాం. వారు గోమతికి చేరుకున్నాక, వారి కుమార్తెను గానీ, ఇతర బంధువులను కానీ కలవలేదు."

- తరుణ్​ కాంతి దేవ్​నాథ్​, గోమతి మేజిస్ట్రేట్​

ఇంటికొస్తూ.. మృతి

బిహార్​లోని మోతీహారికి చెందిన సంతోష్​ మహతో ఆయన తండ్రి దీనానాథ్​లతో పాటు ముఖేష్​ గుప్తా, మున్నా గుప్తాలు నేపాల్​లోని లలిత్​పుర్​లో పాత న్యూస్​ పేపర్లను సేకరించే కార్మికులుగా పనిచేసేవారు. లాక్​డౌన్​ విధించి మూడు వారాలు దాటడం వల్ల ఉన్న డబ్బు కాస్తా ఖర్చయిపోయింది.

దీంతో సైకిల్​పైనే ఇంటికి చేరుకోవాలని నిశ్చయించుకున్నారు. రెండు సైకిళ్లపై నలుగురూ ప్రయాణం మొదలెట్టారు. సంతోష్​, ముఖేష్​లు ప్రయాణిస్తున్న ఓ సైకిల్​ ఝక్రిదాదాలో 150 కి.మీ ఎత్తైన నిటారు కొండలపై నుంచి కిందపడిపోయింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. దీనానాథ్​, మున్నాలు ఇంటికి చేరుకున్నారు.

ఇదీ చదవండి:కుమార్తె కోసం సాహసం చేసి కానరాని లోకాలకు...

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ సామాన్యులను ఆపసోపాలు పెడుతోంది. ఇంటికి దూరంగా ఇరుక్కుపోయి.. ఇక్కట్లు పడుతున్నవారు స్వగ్రామాలకు చేరేందుకు సాహసాలే చేస్తున్నారు. త్రిపురకు చెందిన దంపతులు చెన్నైలో చిక్కుకుని.. ఎప్పుడో నిశ్చయించుకన్న కూతురు పెళ్లి చేసేందుకు 3000 కి.మీ అంబులెన్స్​లో ప్రయాణం చేశారు.​

ఇక నేపాల్​ నుంచి సైకిల్​పై ఇంటికి వస్తూ ప్రాణాలే విడిచారు ఇద్దరు భారతీయులు.

​అంత దూరం అంబులెన్స్​లోనే..

త్రిపుర గోమతి జిల్లా, ఉదయ్​పుర్​కు చెందిన చంచల్​ మజుమ్దార్​.. భార్య అషీమాకు చికిత్స చేయించేందుకు చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. చికిత్స పూర్తయినా లాక్​డౌన్​తో రవాణా సౌకర్యాలు లేని కారణంగా తిరిగి ఇంటికి వెళ్లలేకపోయారు ఆ దంపతులు. ఊరుకానీ ఊరిలో తిండికి తిప్పలు పడుతూ కాలం గడిపారు. మరోవైపు, వచ్చె నెల కుమార్తె పెళ్లి నిశ్చయమైంది. అందుకే, ఏదేమైనా సరేనని అంబులెన్స్​లోనే 3,213 కి.మీ ప్రయాణించి ఉదయపుర్​కు చేరుకున్నారు.

"మేము అపోలో హాస్పిటల్​కు వెళ్లాము. అక్కడ నా భార్యకు ఆపరేషన్​ జరిగింది. ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యే సమయానికి లాక్​డౌన్​ ప్రకటించింది ప్రభుత్వం. అక్కడే ఉండాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతే, కాదు వచ్చే నెల 8వ తేదిన నా కుమార్తె వివాహం ఉంది. అందుకే, అంబులెన్స్ అద్దెకు తీసుకుని ఇంటికి రావలసివచ్చింది."

-మజుమ్దార్​

సుదీర్ఘ అంబులెన్స్​ ప్రయాణంలో.. తమిళనాడు, ఒడిశా, బంగాల్​, అసోం, మేఘాలయా, త్రిపుర సరిహద్దుల్లో ఆసుపత్రి పత్రాలను చూపించాల్సి వచ్చింది మజుమ్దార్​. అదే వాహనంలో త్రిపురకు చెందిన మరో పేషంట్​ను కూడా స్వగ్రామానికి చేర్చారు ఆ దంపతులు.

ప్రస్తుతం ఆ ముగ్గురూ ఉదయ్​పుర్​లోని ఓ క్వారంటైన్ కేంద్రం​లో ఉన్నారని గోమతి జిల్లా మేజిస్ట్రేట్​ తరుణ్​ కాంతి దేవ్​నాథ్​ తెలిపారు.

"ఎన్నో రాష్ట్రాలు, కరోనా ప్రభావిత ప్రాంతాలను దాటి వచ్చారు. కాబట్టి, వారిని మేము నిర్బంధ కేంద్రానికి తరలించాం. వారు గోమతికి చేరుకున్నాక, వారి కుమార్తెను గానీ, ఇతర బంధువులను కానీ కలవలేదు."

- తరుణ్​ కాంతి దేవ్​నాథ్​, గోమతి మేజిస్ట్రేట్​

ఇంటికొస్తూ.. మృతి

బిహార్​లోని మోతీహారికి చెందిన సంతోష్​ మహతో ఆయన తండ్రి దీనానాథ్​లతో పాటు ముఖేష్​ గుప్తా, మున్నా గుప్తాలు నేపాల్​లోని లలిత్​పుర్​లో పాత న్యూస్​ పేపర్లను సేకరించే కార్మికులుగా పనిచేసేవారు. లాక్​డౌన్​ విధించి మూడు వారాలు దాటడం వల్ల ఉన్న డబ్బు కాస్తా ఖర్చయిపోయింది.

దీంతో సైకిల్​పైనే ఇంటికి చేరుకోవాలని నిశ్చయించుకున్నారు. రెండు సైకిళ్లపై నలుగురూ ప్రయాణం మొదలెట్టారు. సంతోష్​, ముఖేష్​లు ప్రయాణిస్తున్న ఓ సైకిల్​ ఝక్రిదాదాలో 150 కి.మీ ఎత్తైన నిటారు కొండలపై నుంచి కిందపడిపోయింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. దీనానాథ్​, మున్నాలు ఇంటికి చేరుకున్నారు.

ఇదీ చదవండి:కుమార్తె కోసం సాహసం చేసి కానరాని లోకాలకు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.