Shepherd Murder In Kamareddy : గొర్రెలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులు తమ బాగోతం బయటపడుతుందేమోనని భయంతో ఓ తండ్రి, కుమారుడిని పొట్టనబెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో రెండు నెలల క్రితం ఇద్దరు దుండగులు మల్లయ్యకు చెందిన గొర్రెలను దొంగిలిస్తుండగా చిన్న మల్లయ్య కుమారుడు ప్రవీణ్ చూశాడు. దొంగతనం బాగోతం బయటకు వస్తుందని భావించి ఆ దుండగులు ప్రవీణ్ను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో మనస్థాపం చెందిన ప్రవీణ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం విషయం ఎలాగైనా తండ్రికి తెలిసి ఉంటుందని అనుమానంతో అతణ్ని హత్య చేసేందుకు దుండగులు పథకం వేశారు. ఈ నెల 19న గొర్రెలు, మేకలు మేపేందుకు వెళ్లిన చిన్న మల్లయ్యను మరో వ్యక్తితో కలిసి హత్య చేసి పూడ్చి పెట్టారు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
గొర్రెల చోరీ గురించి తెలిసిందన్న భయంతో ఇద్దరిని పొట్టనబెట్టుకున్న దొంగలు
Published : Jul 23, 2024, 7:54 PM IST
Shepherd Murder In Kamareddy : గొర్రెలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులు తమ బాగోతం బయటపడుతుందేమోనని భయంతో ఓ తండ్రి, కుమారుడిని పొట్టనబెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో రెండు నెలల క్రితం ఇద్దరు దుండగులు మల్లయ్యకు చెందిన గొర్రెలను దొంగిలిస్తుండగా చిన్న మల్లయ్య కుమారుడు ప్రవీణ్ చూశాడు. దొంగతనం బాగోతం బయటకు వస్తుందని భావించి ఆ దుండగులు ప్రవీణ్ను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో మనస్థాపం చెందిన ప్రవీణ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం విషయం ఎలాగైనా తండ్రికి తెలిసి ఉంటుందని అనుమానంతో అతణ్ని హత్య చేసేందుకు దుండగులు పథకం వేశారు. ఈ నెల 19న గొర్రెలు, మేకలు మేపేందుకు వెళ్లిన చిన్న మల్లయ్యను మరో వ్యక్తితో కలిసి హత్య చేసి పూడ్చి పెట్టారు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.