ETV Bharat / snippets

గొర్రెల చోరీ గురించి తెలిసిందన్న భయంతో ఇద్దరిని పొట్టనబెట్టుకున్న దొంగలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 7:54 PM IST

SHEEP THIEVES MURDER IN KAMAREDDY
Shepherd Murder In Kamareddy (ETV Bharat)

Shepherd Murder In Kamareddy : గొర్రెలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులు తమ బాగోతం బయటపడుతుందేమోనని భయంతో ఓ తండ్రి, కుమారుడిని పొట్టనబెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో రెండు నెలల క్రితం ఇద్దరు దుండగులు మల్లయ్యకు చెందిన గొర్రెలను దొంగిలిస్తుండగా చిన్న మల్లయ్య కుమారుడు ప్రవీణ్ చూశాడు. దొంగతనం బాగోతం బయటకు వస్తుందని భావించి ఆ దుండగులు ప్రవీణ్​ను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో మనస్థాపం చెందిన ప్రవీణ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం విషయం ఎలాగైనా తండ్రికి తెలిసి ఉంటుందని అనుమానంతో అతణ్ని హత్య చేసేందుకు దుండగులు పథకం వేశారు. ఈ నెల 19న గొర్రెలు, మేకలు మేపేందుకు వెళ్లిన చిన్న మల్లయ్యను మరో వ్యక్తితో కలిసి హత్య చేసి పూడ్చి పెట్టారు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

Shepherd Murder In Kamareddy : గొర్రెలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులు తమ బాగోతం బయటపడుతుందేమోనని భయంతో ఓ తండ్రి, కుమారుడిని పొట్టనబెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో రెండు నెలల క్రితం ఇద్దరు దుండగులు మల్లయ్యకు చెందిన గొర్రెలను దొంగిలిస్తుండగా చిన్న మల్లయ్య కుమారుడు ప్రవీణ్ చూశాడు. దొంగతనం బాగోతం బయటకు వస్తుందని భావించి ఆ దుండగులు ప్రవీణ్​ను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో మనస్థాపం చెందిన ప్రవీణ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం విషయం ఎలాగైనా తండ్రికి తెలిసి ఉంటుందని అనుమానంతో అతణ్ని హత్య చేసేందుకు దుండగులు పథకం వేశారు. ఈ నెల 19న గొర్రెలు, మేకలు మేపేందుకు వెళ్లిన చిన్న మల్లయ్యను మరో వ్యక్తితో కలిసి హత్య చేసి పూడ్చి పెట్టారు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.