ETV Bharat / snippets

నల్గొండ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు బోల్తా - 30 మందికి స్వల్పగాయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2024, 12:03 PM IST

Private Bus overturns In Nalgonda
Private Bus overturns In Nalgonda (ETV Bharat)

Private Bus Overturns In Nalgonda : నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం వద్ద నార్కట్​పల్లి రహదారిపై ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం జగిత్యాల నుంచి ఓ ప్రైవేటు బస్సు ప్రయాణికులతో దర్శికి బయలుదేరింది. కొంతదూరం వెళ్లేసరికే మార్గమాధ్యలో తెల్లవారుజామున బస్సు అదుపుతప్పి నార్కెట్​పల్లి రహదారిపై బోల్తాపడింది.

సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు డ్రైవర్​ తెలిపారు. రహదారికి అడ్డంగా బస్సు పడటంతో కొంతసేపు ట్రాఫిక్​ అంతరాయం కలిగింది. జేసీబీ, క్రేన్‌తో బస్సును రోడ్డుపై నుంచి తొలగింపజేశారు.

Private Bus Overturns In Nalgonda : నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం వద్ద నార్కట్​పల్లి రహదారిపై ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం జగిత్యాల నుంచి ఓ ప్రైవేటు బస్సు ప్రయాణికులతో దర్శికి బయలుదేరింది. కొంతదూరం వెళ్లేసరికే మార్గమాధ్యలో తెల్లవారుజామున బస్సు అదుపుతప్పి నార్కెట్​పల్లి రహదారిపై బోల్తాపడింది.

సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు డ్రైవర్​ తెలిపారు. రహదారికి అడ్డంగా బస్సు పడటంతో కొంతసేపు ట్రాఫిక్​ అంతరాయం కలిగింది. జేసీబీ, క్రేన్‌తో బస్సును రోడ్డుపై నుంచి తొలగింపజేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.