ETV Bharat / snippets

రాష్ట్ర ప్రజలకు అలర్ట్ - నేటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 8:30 AM IST

Prakavani Program
Prajavani Program In Telangana (ETV Bharat)

Prajavani Program In Telangana : నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో కొనసాగుతుందని ప్రజావాణి ఇంఛార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజాభవన్​లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల మార్చి 16 నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఎన్నికల కోడ్ ముగిసినందున ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. దాదాపు మూడు నెలల తర్వాత ప్రారంభం కానుండడంతో ఫిర్యాదులు అధికంగా వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు ప్రజావాణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణి రాష్ట్ర నోడల్ ఆఫీసర్​గా ఐఏఎస్ అధికారి దివ్య కొనసాగుతున్నారు.

Prajavani Program In Telangana : నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో కొనసాగుతుందని ప్రజావాణి ఇంఛార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజాభవన్​లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల మార్చి 16 నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఎన్నికల కోడ్ ముగిసినందున ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. దాదాపు మూడు నెలల తర్వాత ప్రారంభం కానుండడంతో ఫిర్యాదులు అధికంగా వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు ప్రజావాణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణి రాష్ట్ర నోడల్ ఆఫీసర్​గా ఐఏఎస్ అధికారి దివ్య కొనసాగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.