Police Seized Ganja In Bhadradri : కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో చాలా మంది యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి గంజాయి రవాణాకు పాల్పడుతున్నారని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కోటి రూపాయలు విలువ గల 319 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు.
మొత్తం ఐదు కేసులలో పది మందిని అరెస్టు చేశామని నలుగురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి 2 కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లను సీజ్ చేశామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఒడిశాలోని వివిధ ప్రాంతాలలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి భద్రాచలం మీదుగా హైదరాబాద్, ముంబయి వంటి నగరాలకు సరఫరా చేస్తూ యువత పట్టుబడుతున్నారని తెలిపారు.