ETV Bharat / snippets

విజయవాడ ముంపు బాధితులకు అండగా నెల్లూరు కార్పొరేషన్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 1:27 PM IST

Help to Vijayawada Flood Victims
Help to Vijayawada Flood Victims (ETV Bharat)

Nellore Corporation Help Vijayawada Victims : విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేెందుకు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందుకు వచ్చింది. తొమ్మిది వాహనాల్లో 55,000ల ఆహార ప్యాకెట్లను విజయవాడకు పంపించారు. భారీ వర్షాలు, వరదలతో ముంపునకు గురైన బాధితులను ఆదుకోవడంలో నెల్లూరు ప్రజలు భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ కోరారు.

సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ఆదేశాలతో హోటల్ అసోషియేషన్లు, కేటరింగ్ బృందాలతో మాట్లాడి లక్ష మందికి మధ్యాహ్నం భోజనం, మరో లక్ష మందికి రాత్రి భోజనాలను సిద్ధం చేసి పంపిస్తామని సూర్యతేజ తెలిపారు. ముంపు బాధితులను ఆదుకోవడం కోసం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఎలాంటి సహాయ, సహకారాలు అందించినా తాము బాధితులకు చేరుస్తామని సూర్యతేజ వెల్లడించారు.

Nellore Corporation Help Vijayawada Victims : విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేెందుకు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందుకు వచ్చింది. తొమ్మిది వాహనాల్లో 55,000ల ఆహార ప్యాకెట్లను విజయవాడకు పంపించారు. భారీ వర్షాలు, వరదలతో ముంపునకు గురైన బాధితులను ఆదుకోవడంలో నెల్లూరు ప్రజలు భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ కోరారు.

సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ఆదేశాలతో హోటల్ అసోషియేషన్లు, కేటరింగ్ బృందాలతో మాట్లాడి లక్ష మందికి మధ్యాహ్నం భోజనం, మరో లక్ష మందికి రాత్రి భోజనాలను సిద్ధం చేసి పంపిస్తామని సూర్యతేజ తెలిపారు. ముంపు బాధితులను ఆదుకోవడం కోసం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఎలాంటి సహాయ, సహకారాలు అందించినా తాము బాధితులకు చేరుస్తామని సూర్యతేజ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.