Nandigam Suresh Health Updates: మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్ను వైద్య పరీక్షల అనంతరం తిరిగి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఉదయం భుజం నొప్పి, ఛాతి నొప్పితో అస్వస్థతకు గురికాగా, జైలు అధికారులు నందిగం సురేష్ను జీజీహెచ్కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు నందిగం సురేష్కు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో నందిగం సురేష్ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. వైద్యుల సూచన మేరకు నందిగం సురేష్ను తిరిగి జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. వెలగపూడి దళిత మహిళ మరియమ్మ మృతి కేసులో పీటీ వారెంట్ ఇవ్వగా, కోర్టు 14 రోజులు నందిగం సురేష్కు రిమాండ్ విధించింది.
నందిగం సురేష్కు అస్వస్థత - ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యుల నివేదిక
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2024, 4:55 PM IST
Nandigam Suresh Health Updates: మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్ను వైద్య పరీక్షల అనంతరం తిరిగి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఉదయం భుజం నొప్పి, ఛాతి నొప్పితో అస్వస్థతకు గురికాగా, జైలు అధికారులు నందిగం సురేష్ను జీజీహెచ్కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు నందిగం సురేష్కు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో నందిగం సురేష్ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. వైద్యుల సూచన మేరకు నందిగం సురేష్ను తిరిగి జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. వెలగపూడి దళిత మహిళ మరియమ్మ మృతి కేసులో పీటీ వారెంట్ ఇవ్వగా, కోర్టు 14 రోజులు నందిగం సురేష్కు రిమాండ్ విధించింది.