Monkeys Died in Khammam : విషాహారం తిని కోతులు ప్రాణాలు విడిచిన ఘటన ఖమ్మం జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో కిష్టారం లారీ అసోసియేషన్ కార్యాలయం సమీపంలో దాదాపు 10 కోతుల వరకు మృతి చెంది పడి ఉన్నాయి. ఓ తల్లి కోతి కళేబరాన్ని పిల్ల కోతి తట్టిలేపుతూ ఉన్న దృశ్యం అక్కడున్న వారందరినీ కలిచివేసింది.
విషం కలిపిన ఆహారాన్ని తినడం వల్లే కోతులు మృతి చెందాయని, వెంటనే బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఖమ్మం బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి అప్పటికే ఖననం చేసిన కోతుల కళేబరాలను వెలికి తీయించారు. ఈ మేరకు ఘటనపై సత్తుపల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు.