Lab Technicians Appointment Papers: కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన 282 మంది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ల(ఎమ్ఎల్టీ)కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి దామోదర రాజ నరసింహ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దామోదర రాజనరసింహ ల్యాబ్ టెక్నీషన్ల పోస్టుల భర్తీకి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర చాలా కీలకమన్నారు. రోగ నిర్ధారణ ద్వారానే బాధితులకు మెరుగైన చికిత్సను వైద్యులు అందించగలరని పేర్కొన్నారు. త్వరలోనే మరో 1300 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చుంగ్తో, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డీఎంఈ వాణి సహా పలువురు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.