Minister Narayana Reviewed with Officials on Diarrhea: పల్నాడు జిల్లాలో డయేరియా విజృంభించడంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులతో క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్షించారు. పిడుగురాళ్లలో ఇప్పటి వరకు 60 డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కృష్ణా నది నుంచి మంచినీరు అందించేందుకు 16 కి.మీ పైప్ లైన్ ఉందని దీంతో పాటు పట్టణంలో నీరు అందిస్తున్నట్లు తెలిపారు. పైప్లైన్లోని ఒక పవర్ బోర్లో నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారని తెలిపారు. వాటర్ లీకేజీని గుర్తించి 5 రోజులు పాటు నీటి సరఫరా నిలిపివేసామని తెలిపారు. ఆ నీటిని పరీక్ష కోసం విజయవాడ ల్యాబ్కు శాంపిల్స్ పంపిస్తున్నట్లు వివరించారు. పట్టణంలో ఉన్న ఆర్వో ప్లాంట్స్లోని నీటిని కూడా పరిక్షించాల్సి ఉందని వారం రోజుల్లో నీరు ఎక్కడ కలుషితం ఆయిందనేది క్లారిటీ వస్తుందని నారాయణ తెలిపారు.
పల్నాడులో నీటి కలుషితంపై వారం రోజుల్లో స్పష్టత- మంత్రి నారాయణ
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 11, 2024, 9:45 PM IST
![పల్నాడులో నీటి కలుషితంపై వారం రోజుల్లో స్పష్టత- మంత్రి నారాయణ narayana_review_on_diarrhea](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-07-2024/1200-675-21927728-thumbnail-16x9-narayana-review-on-diarrhea.jpg?imwidth=3840)
Minister Narayana Reviewed with Officials on Diarrhea: పల్నాడు జిల్లాలో డయేరియా విజృంభించడంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులతో క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్షించారు. పిడుగురాళ్లలో ఇప్పటి వరకు 60 డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కృష్ణా నది నుంచి మంచినీరు అందించేందుకు 16 కి.మీ పైప్ లైన్ ఉందని దీంతో పాటు పట్టణంలో నీరు అందిస్తున్నట్లు తెలిపారు. పైప్లైన్లోని ఒక పవర్ బోర్లో నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారని తెలిపారు. వాటర్ లీకేజీని గుర్తించి 5 రోజులు పాటు నీటి సరఫరా నిలిపివేసామని తెలిపారు. ఆ నీటిని పరీక్ష కోసం విజయవాడ ల్యాబ్కు శాంపిల్స్ పంపిస్తున్నట్లు వివరించారు. పట్టణంలో ఉన్న ఆర్వో ప్లాంట్స్లోని నీటిని కూడా పరిక్షించాల్సి ఉందని వారం రోజుల్లో నీరు ఎక్కడ కలుషితం ఆయిందనేది క్లారిటీ వస్తుందని నారాయణ తెలిపారు.