ETV Bharat / snippets

నిజామాబాద్​ జిల్లాలో పిడుగుపాటుతో యువకుడి మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 10:04 PM IST

MAN DIED DUE TO THUNDERSTORM
Man Killed in Lightning Strike (ETV Bharat)

Man Killed in Lightning Strike : పిడుగుపాటుకు యువకుడి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలంలోని ధర్మరాం(బి)లో శుక్రవారం చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన శాకటి ప్రేమ్ కుమార్(32) సాయంత్రం 6 గంటల సమయంలో డిచ్​పల్లి వెళ్తుండగా ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో ప్రేమ్​కుమార్ చెట్టు కిందకు చేరుకోగా పిడుగుపాటుకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు.

రాత్రి అయినా ప్రేమ్​కుమార్ ఇంకా ఇంటికి రాకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, రాత్రి 12 గంటల సమయంలో వెతకగా గ్రామ శివారులో మృతి చెంది కనిపించాడు. మొదట అనుమానాస్పద మృతిగా భావించి పోస్టుమార్టం నిర్వహించగా పిడుగుపాటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, 18 నెలల పాప ఉంది. మృతుడు ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.

Man Killed in Lightning Strike : పిడుగుపాటుకు యువకుడి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలంలోని ధర్మరాం(బి)లో శుక్రవారం చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన శాకటి ప్రేమ్ కుమార్(32) సాయంత్రం 6 గంటల సమయంలో డిచ్​పల్లి వెళ్తుండగా ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో ప్రేమ్​కుమార్ చెట్టు కిందకు చేరుకోగా పిడుగుపాటుకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు.

రాత్రి అయినా ప్రేమ్​కుమార్ ఇంకా ఇంటికి రాకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, రాత్రి 12 గంటల సమయంలో వెతకగా గ్రామ శివారులో మృతి చెంది కనిపించాడు. మొదట అనుమానాస్పద మృతిగా భావించి పోస్టుమార్టం నిర్వహించగా పిడుగుపాటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, 18 నెలల పాప ఉంది. మృతుడు ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.