Kishan Reddy Oath in Lok Sabha : దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో 18వ లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లో తొలి రోజు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో తెలంగాణలో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డి ఎంపీ, కరీంనగర్ నుంచి గెలుపొందిన బండి సంజయ్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు కేంద్రమంత్రులు తెలుగులో తమ ప్రమాణాన్ని చేశారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు రాష్ట్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు లభించింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్లను నియమించింది. రాష్ట్రం నుంచి 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.