Gold Seize in Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి నుంచి రూ.కోటి విలువ చేసే 1.4 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని సోదాలు చేశారు.
ప్రయాణికుడి బూట్లతో పాటు అతని బ్యాగ్ ప్యాక్ను తనిఖీ చేయడంతో బ్యాటరీ ఆకారంలో దాచిపెట్టిన రెండు పసుపు రంగుల పెద్ద మెటల్ బార్, లోహపు గొలుసు పట్టుబడ్డాయి. బంగారం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.