Husband Killed His Wife In Rajanna Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను చంపి, తాను ఉరేసుకొని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. శాంతి నగర్కు చెందిన దూస రాజేశం గత కొంతకాలంగా కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నాడు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న రాజేశం తనకు మెరుగైన వైద్యం చేయించాలని కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవాడు.
ఈ క్రమంలోనే భార్యతో విగ్వాదానికి దిగిన రాజేశం క్షణికావేశంలో భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేశం, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు, కుమారైకు వివాహం కాగా చిన్న కుమారుడు బీటెక్ చేస్తున్నట్లు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.