Student Suicide Attempt in Hyderabad : ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జనగామ జిల్లా దేవరుప్పులకు చెందిన ఓ యువతి ఘట్కేసర్లోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతుంది.
హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి ఎన్ఎఫ్సీ నగర్ రైల్వే వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు ఆమెను ఘట్కేసర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.