ETV Bharat / snippets

తెలంగాణ పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు - ఒకరు మృతి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 5:37 PM IST

Encounter_in_Mulugu_District
Encounter_in_Mulugu_District (ETV Bharat)

Encounter in Mulugu District: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అల్లిగూడెం అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందారు. కాగా గురువారం తెల్లవారుజామున ఈ ఫైరింగ్​ జరిగింది. పోలీసుల ఎన్​కౌంటర్​లో మావోయిస్టు అశోక్​ అలియాస్​ విజేందర్​ మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతుడు జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిధిలోని బుద్ధారం వాసి.

Maoist Encounter In TG- Chhattisgarh border: కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే తెలంగాణ-ఛత్తీస్​గఢ్ సరిహద్దులో జరిగింది. వడ్డిపేట-పూసుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా గ్రే హౌండ్స్ బృందం, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు మావోలు మృతిచెందారు. మృతుల్లో ఒకరు ఐవోఎస్ కమాండర్ రాజేశ్​గా పోలీసులు గుర్తించారు.

Encounter in Mulugu District: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అల్లిగూడెం అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందారు. కాగా గురువారం తెల్లవారుజామున ఈ ఫైరింగ్​ జరిగింది. పోలీసుల ఎన్​కౌంటర్​లో మావోయిస్టు అశోక్​ అలియాస్​ విజేందర్​ మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతుడు జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిధిలోని బుద్ధారం వాసి.

Maoist Encounter In TG- Chhattisgarh border: కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే తెలంగాణ-ఛత్తీస్​గఢ్ సరిహద్దులో జరిగింది. వడ్డిపేట-పూసుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా గ్రే హౌండ్స్ బృందం, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు మావోలు మృతిచెందారు. మృతుల్లో ఒకరు ఐవోఎస్ కమాండర్ రాజేశ్​గా పోలీసులు గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.