CM Revanth Warangal Tour Today : భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం మహబూబాబాద్ జిల్లాలో వరద బాధితులను పరామర్శించనున్నారు. ఖమ్మం నుంచి నేరుగా డోర్నకల్ నియోజకవర్గం ఎన్టీఆర్ సర్కిల్ చేరుకుని, అక్కడి నుంచి మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో ఆకేరు వాగు వంతెనను పరిశీలిస్తారు.
వరద తీవ్రతపై సీఎం రేవంత్ ఆరా తీస్తారు. అక్కడి నుంచి వరద ముంపునకు గురైన నెల్లికుదురు మండలం రావిలాల గ్రామానికి వెళ్లి బాధితులతో మాట్లాడి వరద నష్టాన్ని తెలుసుకోనున్నారు. అక్కడి నుంచి కురవి మీదుగా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని జరిగిన నష్టం, బాధితులకు అందే సాయం, చేపట్టే సహాయక చర్యలపై అధికారులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.