Case filed on Kodali Nani : ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై పీఎస్లో కేసు నమోదైంది. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్ మాధవీలతారెడ్డిపై కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వాసుదేవరెడ్డి, కొడాలి నాని కారణమయ్యారంటూ గుడివాడ రెండో పట్టణ పీఎస్లో గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు.
తమ గోదాములో ఉన్న లిక్కర్ కేసులను పగులకొట్టి తగులబెట్టారని అందులో పేర్కొన్నారు. తమ బాధ చెబితే వాసుదేవరెడ్డి, మాధవీలత దూషించారని ఆరోపించారు. కొద్దిరోజులకే తన తల్లి మనస్తాపంతో మరణించిందని ప్రభాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.