BRS MLC Challa Venkatarami Reddy Met CM Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమస్యలపై చల్లా, రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీంతోపాటు రాయ్చూర్ నుంచి శ్రీశైలం వరకు రహదారిని 4లేన్లుగా అభివృద్ధి చేయాలని, ఆర్డీఎస్ కింద రిజర్వాయర్లు, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కోరారు. గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల వారికి కర్నూలు ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
గత వారం, పది రోజులుగా అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజేయుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డిలు కాంగ్రెస్లో చేరతారని హస్తం పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్నగర్ వెళ్తున్నందున, ఆ పర్యటనలో వీరిద్దరూ కాంగ్రెస్లో చేరతారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.